📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

కుప్పకూలిన మంచు కొండ.. 47 కార్మికులు గల్లంతు

Author Icon By Sudheer
Updated: February 28, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ-బద్రీనాథ్ జాతీయ రహదారి వద్ద ఉన్న మంచు కొండ ఒక్కసారిగా కుప్పకూలడంతో రోడ్డు నిర్మాణ పనిలో ఉన్న కార్మికులు మంచు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మొత్తం 57 మంది కార్మికులు ప్రమాదానికి గురయ్యారు, వీరిలో 10 మందిని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. అయితే, మిగిలిన 47 మంది ఆచూకీ తెలియలేదు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించి, కార్మికులను కాపాడేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.

Collapsed ice mountain

ప్రమాద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగింపు

ఈ విషాదకర ఘటనకు స్పందించిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ITBP), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. మంచు కొండ కుప్పకూలిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. మంచు శిథిలాలను తొలగిస్తూ, కార్మికులను రక్షించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే, విపరీతమైన మంచు, పొగమంచు కారణంగా సహాయక చర్యలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి.

వాతావరణ హెచ్చరికలు – భద్రతా చర్యలు తీసుకోవాలి

భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రాత్రి వరకు 20 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాలు రహదారులపై వరదలను కలిగించడంతో పాటు, లోతట్టు ప్రాంతాలను జలమయం చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లోని అండర్‌పాస్‌లను మూసివేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

Collapsed ice mountain Google news mountain Uttarakhand

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.