📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

రైల్వేస్టేషన్‌లో కూలిన పైకప్పు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 11, 2025 • 7:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ రైల్వేస్టేషన్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లలో ఇప్పటివరకు 23 మందిని బయటికి తీశారు. మిగతావారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగనప్పుడు దాదాపు 35 మంది సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నారు.

image

ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇదిలాఉండగా.. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే సిబ్బంది పలు నిర్మాణాలు చేపట్టారు. అయితే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడున్న స్థానికులు భయందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పైకప్పు కూలిన ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000, అలాగే స్వల్పంగా గాయపడిన వారికి రూ.5,000 పరిహారాన్ని యోగీ సర్కార్ ప్రభుత్వం ప్రకటించింది.

Kannauj railway station Lintel collapsed Uttarpradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.