Breaking News: CM: బ్రాహ్మణులే జ్ఞానవంతులంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు

Read Time:  1 min
Delhi CM Rekha Gupta
Delhi CM Rekha Gupta
FONT SIZE
GET APP

రేఖా గుప్తా Delhi CM Rekha Gupta వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి సమాజంలో విజ్ఞానం, సంస్కారం, ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర అపారమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని పీతంపురలో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేఖా గుప్తా అన్నారు — “మన సమాజంలో జ్ఞానదీపం వెలిగించేది బ్రాహ్మణులే. వారు శాస్త్రాలను మాత్రమే కాకుండా శస్త్రాలను కూడా ఆరాధిస్తారు. దేశం ముందుకు సాగాలంటే విజ్ఞానం, శక్తి రెండూ అవసరం” అని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులు ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పంచి, సాంప్రదాయ విలువలను కాపాడుతూ, సమాజ హితాన్ని కోరుకుంటారని ఆమె ప్రశంసించారు. “ఎదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నా, బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయాలి” అని పేర్కొన్నారు.

Jet Fighter: పాకిస్తాన్ కు రష్యా ఇంజిన్లు… భారత పై ప్రభావమెంత?

Delhi CM Rekha Gupta

Delhi CM Rekha Gupta

గత మూడు దశాబ్దాలుగా

తరువాత ఢిల్లీలో అభివృద్ధి మందగమనంపై ఆమె విమర్శలు గుప్పించారు. “గత మూడు దశాబ్దాలుగా ఢిల్లీ ఎదుగుదల చాలా నెమ్మదిగా సాగింది. ఇకనైనా గేర్లు మార్చి వేగం పెంచాల్సిన సమయం వచ్చింది. ప్రజల సహకారంతో ‘వికసిత్ ఢిల్లీ’ లక్ష్యాన్ని చేరుకోవచ్చు” అని ఆమె నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించాలి అని, ఐక్యతతోనే నిజమైన ప్రగతి సాధ్యమని రేఖా గుప్తా స్పష్టం చేశారు.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎక్కడ వ్యాఖ్యలు చేశారు?
ఢిల్లీలోని పీతంపురలో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ మహాసభలో ఆమె వ్యాఖ్యలు చేశారు.

రేఖా గుప్తా ఏమన్నారు?
బ్రాహ్మణులు సమాజంలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నారని, వారు శాస్త్రాలతో పాటు శస్త్రాలను కూడా పూజిస్తారని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.