हिन्दी | Epaper

CJI:కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది

Radha
CJI:కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే సమాజంలోని ధనవంతులు కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కార్లు అవసరానికి మించి స్టేటస్ సింబల్‌గా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: TG Weather: జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

CJI

సైకిళ్ల వినియోగాన్ని వదిలేసి, కార్లు కొనుగోలు చేయడానికే ప్రజలు డబ్బు ఆదా చేస్తున్న పరిస్థితి నెలకొందని CJI వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ధనవంతులు ఒకటికంటే ఎక్కువ కార్లు కొనడం మానేస్తే కాలుష్య స్థాయులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సూచించారు. అలాగే అధిక ఇంధనం వినియోగించే హైఎండ్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

ఢిల్లీ కాలుష్య నియంత్రణ వ్యవస్థపై కూడా CJI తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి నాణ్యత పర్యవేక్షణ కమిషన్ (AQMC) తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమవుతోందని విమర్శించారు. టోల్ ప్లాజాల మూసివేతకు రెండు నెలల గడువు కావాలని అధికారులు కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. కాలుష్య నియంత్రణ విషయంలో ఆలస్యం తగదని, తక్షణమే చర్యలు అవసరమని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

పెళ్లి కుదిరాక ఫోన్‌ ముచ్చట్లు నిషేధం.. ఎందుకంటే?

పెళ్లి కుదిరాక ఫోన్‌ ముచ్చట్లు నిషేధం.. ఎందుకంటే?

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ!

మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ!

వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

📢 For Advertisement Booking: 98481 12870