📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest news: CJI: జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు

Author Icon By Saritha
Updated: October 27, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జస్టిస్ గవాయ్ సిఫారసుతో కేంద్రానికి ప్రతిపాదన

భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్(CJI) సూర్యకాంత్ నియామక ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్(B.R.Gavai) తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సూచించారు. ఈ సిఫారసుతో ఆయన నియామకానికి మార్గం సాఫీ అయ్యింది.

జస్టిస్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనుండగా, తదుపరి రోజు నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు సీనియారిటీ ఆధారంగా సీజేఐ నియామకం జరిగే సంప్రదాయం ప్రకారం ఈ ఎంపిక జరిగింది.

Read also: మొంథా తుపాన్‌ ప్రభావం – ఏపీలో భారీ వర్షాలు

CJI: జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు

సూర్యకాంత్ జీవిత ప్రస్థానం

1962 ఫిబ్రవరి 10న హర్యానాలో జన్మించిన సూర్యకాంత్,(CJI)హిసార్ ప్రభుత్వ పీజీ కళాశాల నుంచి డిగ్రీ, మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీస్ ప్రారంభించి, 1985లో చండీగఢ్‌కు మారి పంజాబ్–హర్యానా హైకోర్టులో వాదనలు ప్రారంభించారు.

2000లో హర్యానా రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులై గుర్తింపు పొందారు. 2004లో పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. త్వరలోనే ఆయన నియామకంపై అధికారిక నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CJI Justice Bhushan Gavai Justice Surya Kant Latest News in Telugu Legal News Supreme Court of India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.