బాంబు (a bomb)తో పేల్చివేస్తామని కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు(Chirag Paswan) బెదిరింపు వచ్చింది. సోషల్ మీడియా ఇన్స్టా అకౌంట్ ద్వారా ఆ బెదిరింపునకు పాల్పడ్డారు. పాశ్వాన్(Chirag Paswan) ను చంపేస్తామని సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరించారు. బాంబుతో ఆ నేతపై దాడి చేస్తామని ఆగంతకుడు తన పోస్టులో తెలిపాడు. ఆ పార్టీకి చెందిన ప్రతినిది రాజేశ్ భట్.. ఈ నేపథ్యంలో పాట్నా సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐటీ చట్టంలోని 66ఎఫ్ సెక్షన ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ సైబర్ టెర్రరిజం డీల్ చేస్తుంది. ఇక భారతీయ న్యాయ సంహితలోని 351(2) సెక్షన్ కూడా నమోదు చేశారు.
నేరపూరిత
ఇన్స్టాగ్రామ్లో చావు బెదిరింపులు చేశారు. టైగర్ మిరాజ్ ఇదిసి పేరుతో ఇన్స్టా అకౌంట్ ఉన్నది. పాశ్వాన్(Chirag Paswan) కు విపరీతమైన పాపులారిటీ వస్తున్న నేపథ్యంలో ఆ బెదిరింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. చంపేస్తామని బెదిరించడం నేరపూరిత ఉద్దేశాన్ని బయటపెడుతుందని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 11వ తేదీ రాత్రి 9 గంటలకు మంత్రి పాశ్వాన్కు ప్రాణహాని బెదిరింపు వచ్చినట్లు సైబర్ డీసీపీ నితీశ్ చంద్ర ధరియా తెలిపారు. పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్లోకేసు బుక్ చేశారు.
చిరాగ్ పాశ్వాన్ నిజ జీవితంలో ఎవరు?
చిరాగ్ పాస్వాన్ (జననం 31 అక్టోబర్ 1982) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ నటుడు, జూన్ 2024 నుండి 19వ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిగా, 2021 నుండి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) యొక్క 1వ అధ్యక్షుడిగా, 2019 నుండి 2021 వరకు లోక్ జనశక్తి పార్టీకి 2వ అధ్యక్షుడిగా మరియు లోక్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్నారు.
చిరాగ్ పాశ్వాన్ అర్హత?
పాశ్వాన్ ఝాన్సీలోని బుందేల్ఖండ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్లో 3వ సెమిస్టర్ డ్రాపౌట్. కళాశాల నుండి మానేసిన తర్వాత, అతను మిలే నా మిలే హమ్ (2011) అనే హిందీ చిత్రంలో నటించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also:Modi : నేడు 51 వేల మందికి నియామక పత్రాలు