📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Chirag Paswan: నితీశ్‌తో చిరాగ్ భేటి.. ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు

Author Icon By Anusha
Updated: November 15, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయాన్ని సాధించింది. ఈ గెలుపులో లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్) చీఫ్‌ చిరాగ్ పాశ్వన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. అయితే శనివారం సీఎం నితీశ్‌ కుమార్‌ ఇంటికి చిరాగ్‌ పాశ్వన్‌ వెళ్లారు.

Read Also: Bihar Results: కుటుంబంతో తెగదెంపులతో పటు రాజకీయాలకు గుడ్‌బై లాలూ కుమార్తె

ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ (Chirag Paswan) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తన పని అయిపోయిందని అందరూ అనుకున్నారని.. కానీ ఈసారి వచ్చిన విజయం తనకు ఎంతో విలువైనదని తెలిపారు.2005లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించిందని,

ఆ తర్వాత ఇవే తమకు అత్యుత్తమ ఫలితాలు అని అన్నారు. తమ కూటమిలో ఎల్‌జేపీ, జేడీయూ పాత్రపై ఎన్నికల సమయంలో ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాము కలిసికట్టుగా ముందుకు సాగామని అన్నారు.

విబేధాలు సృష్టించే ప్రయత్నం చేశారని

2025లో మాపై నమ్మకం ఉంచి ఎన్డీయే మాకు ఐదు ఎంపీ స్థానాలు కేటాయిస్తే విజయం సాధించామని, ఒక్క ఎమ్మెల్యే లేని మాకు 29 స్థానాలు కేటాయిస్తే 19 గెలుచుకున్నామని అన్నారు.గెలవలేని స్థానాలను తమకు కావాలనే ఇచ్చారని జేడీయూపై విమర్శలు చేశారని,

తద్వారా తమ మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ ఈ ఫలితాలు ఆ ఆరోపణలను తిప్పికొట్టాయని అన్నారు. ఆర్జేడీ క్రమంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతోందని చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) అన్నారు. 90లలో నడిచిన జంగిల్ రాజ్‌ను ప్రజలు మరోసారి తిప్పికొట్టారని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar-Assembly-Elections Chirag-Paswan latest news NDA-victory nitish-kumar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.