శీతాకాలం ప్రారంభమవడంతో పిల్లల్లో దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు( Child care) వేగంగా పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు చాలాసార్లు వైద్యుడిని సంప్రదించకుండా దగ్గు సిరప్లు కొనుగోలు చేసి పిల్లలకు ఇస్తున్నారు. అయితే ఈ విధానం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దగ్గు సిరప్ సేవించి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనల నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. నాణ్యత లేని మందులు వాడటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read also: Health: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి 3 ప్రధాన కారణాలు ఇవే..
రాష్ట్ర ప్రభుత్వం రెండు సిరప్లపై నిషేధం విధించింది
తెలంగాణ ప్రభుత్వం తాజాగా Relife CF మరియు Respifresh-TR దగ్గు సిరప్లను నిషేధించింది. వీటిలో హానికరమైన పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య( Child care) సంస్థ (WHO) కూడా Coldrif మరియు Respifresh TR సిరప్లను వినియోగించరాదని హెచ్చరిక జారీ చేసింది.
జాగ్రత్త సూచనలు
- పిల్లలకు ఏ మందు ఇవ్వాలన్నా వైద్యుడి సలహా తప్పనిసరి.
- మార్కెట్లో లభించే సిరప్ల మూలం, లైసెన్స్ వివరాలు చెక్ చేయాలి.
- స్వయంగా మందులు ఇవ్వకుండా, తగిన చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి.
చలి కాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణలో తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: