ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బస్తర్ జిల్లాలో అత్యంత బాధాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రత మరియు భయం కారణంగా ఒక తండ్రి తన స్వంత కుమార్తెను ఏకంగా 20 ఏళ్ల పాటు కిటికీలు లేని చీకటి గదిలో బంధించాడు. ఇటీవల అధికారులు ఆమెను రక్షించి బయటకు తీసుకురాగా, ఆమె సుదీర్ఘకాలం పాటు కాంతికి దూరంగా ఉండటం వల్ల తన కంటిచూపును దాదాపు పూర్తిగా కోల్పోయింది.
Read Also: India-Russia: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్
ఈ నరకం బకావండ్ గ్రామానికి చెందిన లీసా అనే యువతికి ఆరేళ్ల వయసులో, ఆమె రెండో తరగతి చదువుతున్నప్పుడు మొదలైంది. 2000 సంవత్సరంలో, ఒక గ్రామస్థుడు ఆమెను చంపేస్తానని బెదిరించడంతో లీసా తీవ్ర భయాందోళనకు గురై, బయటకు రావాలంటేనే భయపడేది. భార్యను కోల్పోయి ఒంటరివాడైన ఆమె తండ్రి, కూతురిని ఎలా కాపాడుకోవాలో తెలియక, ఆమెను ఇంట్లోని చీకటి గదిలో బంధించాడు.
ప్రపంచం కేవలం ఆ గది తలుపు వరకే
గత రెండు దశాబ్దాలుగా ఆ చీకటి గదే లీసా ప్రపంచమైంది. కేవలం ఆహారం అందించడానికి మాత్రమే ఆ గది తలుపు తెరుచుకునేది.
అధికారులు ఆమెను రక్షించే సమయానికి, ఆమె మనుషులను చూసి భయపడటం, కనీసం తన పేరుకు కూడా స్పందించలేని మానసిక స్థితిలో ఉంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, సుదీర్ఘకాలం వెలుగు చూడకపోవడం వల్ల ఆమె కంటిచూపు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మానసికంగా కూడా ఆమె ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది.
‘ఘరౌందా ఆశ్రమం’లో చికిత్స: విచారణకు ఆదేశం
ప్రస్తుతం లీసాను ‘ఘరౌందా ఆశ్రమం’ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుచిత్రా లక్రా మాట్లాడుతూ, “సమాచారం అందగానే ఆమెను రక్షించాం. ఆమె ఇప్పుడు సురక్షితంగా ఉంది. మొదట్లో భయపడినప్పటికీ, ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడుతోంది” అని తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: