Latest news: Chhattisgarh: మావోయిస్టులకు షాక్..27 మంది లొంగుబాటు

Read Time:  1 min
Chhattisgarh
Chhattisgarh
FONT SIZE
GET APP

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సల్స్ నిర్మూలన యత్నాల్లో భాగంగా భద్రతా బలగాలకు మేజర్ విజయంగా పరిగణించదగిన పరిణామం చోటు చేసుకుంది. బుధవారం రోజున మొత్తం 27 మంది క్రియాశీలక మావోయిస్టులు (Chhattisgarh) అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళలు కాగా, మిగిలిన 17 మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) (Liberation Guerrilla Army) బెటాలియన్-01కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు కూడా ఉండడం గమనార్హం. వీరంతా బస్తర్ ప్రాంతంలో గతంలో జరిగిన అనేక హింసాత్మక దాడుల్లో నేరుగా పాల్గొన్నవారుగా గుర్తించబడ్డారు.

Read also: చీజ్ లేకుండా పాస్తా ఎలా తయారు చేయాలి?

Chhattisgarh

ప్రభుత్వ పథకాల ప్రభావం & భద్రతా ఒత్తిడికి ఫలితాలు

ప్రభుత్వం (Govt) అమలు చేస్తున్న ‘నవసంకల్ప్ లొంగుబాటు విధానం’, ‘నియత్ నెల్లా నార్’ వంటి పథకాలు మారుమూల ప్రాంతాల మావోయిస్టులపై గణనీయంగా ప్రభావం చూపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాల నిరంతర కవర్షన్ ప్రొసెస్‌, పునరావాస చర్యల కారణంగా, మావోయిస్టులు(Chhattisgarh) పోరాట మార్గాన్ని వదిలి సామాజిక జీవితంలోకి రావడానికి ముందడుగు వేస్తున్నారు. లొంగుబాటు చేసిన మావోయిస్టులపై రూ. 50 లక్షలకు పైగా రివార్డులు ఉండగా, ఒక్కోరిపై రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు నగదు బహుమతులు ప్రకటించబడి ఉన్నాయి. ప్రభుత్వ పునరావాస పథకాలకు అనుగుణంగా, వీరికి అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని అధికారులు చెప్పారు. ఈ పరిణామం ఇతర మావోయిస్టులకు స్పష్టమైన సందేశం పంపుతుందని, భవిష్యత్తులో మరిన్ని లొంగుబాట్లకు మార్గం సుగమమవుతుందని విశ్వసిస్తున్నారు.

మావోయిస్టులు ఎక్కడ లొంగిపోయారు?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు అధికారుల ఎదుట లొంగిపోయారు.

PLGA బెటాలియన్-01కి సంబంధించి ఎవరు లొంగిపోయారు?
ఈ కీలక బెటాలియన్‌కు చెందిన ఇద్దరు ముఖ్య మావోయిస్టు సభ్యులు లొంగిపోయినవారిలో ఉన్నారు. వీరిని గతంలో హై-ప్రొఫైల్ ఎన్‌కౌంటర్‌లలో పాల్గొన్నవారిగా గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.