📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Chhattisgarh: బీజాపూర్ లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చర్ల: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు (Maoist) ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు, హిడ్మా మరికొందరు కేంద్ర కమిటీ సభ్యుల మరణం, అదే క్రమంలో మరికొందరి అగ్రనేతల లొంగుబాట్లతో నిస్తేజంలో ఉన్న దళ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు లొంగుబాటుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు.

Read Also: Sabarimala: తమిళనాడులో ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

Chhattisgarh 41 Maoists surrender in Bijapur

ప్రభుత్వ విధానాల సానుకూల ఫలితాలు

చత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం నక్సల్ నిర్మూలన మరియు పునరావాస విధానం పథకంపై సానుకూల ఫలితాలు వస్తున్నాయని మరోసారి స్పష్టంగా కనిపించిందని ఎస్పీ అన్నారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారని, బెటాలియన్ నంబర్ 1, వివిధ ఏరియా కమిటీల సభ్యులు, ప్లాటూన్ కంపెనీ, మిలీషియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం సౌత్ సబ్ జోనల్ బ్యూరో నుండి 39 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ధమారి, గరియాబంద్, నొవాపాడ డివిజన్ సభ్యులు ఉన్నారు.

లొంగుబాటుకు కారణాలు, ప్రస్తుత గణాంకాలు

పునరావాసం, భద్రత మరియు సంభాషణ ఆధారిత విధానం, నియ్యద్ నెల్లా నార్ పథకం కార్యకర్తలను లొంగిపోవడానికి మూలకారణం అని ఎస్పీ తెలిపారు. జనవరి 2025 నుండి రాష్ట్రంలో నక్సలైట్ (Naxalite) సంఘటనలలో పాల్గొన్న 528 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 560 మంది లొంగిపోయారు. ఇదే సమయంలో వివిధ ఎన్‌కౌంటర్లలో 144 మంది మావోయిస్టులు మరణించారు. జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 790 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసారని, 1,031 మందిని అరెస్టు చేశామని, 202 మంది ఎన్‌కౌంటర్లలో మరణించినట్లు వెల్లడించారు. లొంగిపోయిన ఒక్కొక్కరికి రూ.50 వేల తక్షణ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ (CRPF) ఉన్నతాధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

anti-Naxal operations Bijapur Maoist surrender Chhattisgarh Naxalites CRPF Google News in Telugu Latest News in Telugu police rehabilitation scheme reward for surrender. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.