📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Chennai: రోడ్డుపై దొరికిన నోట్ల కట్టలు.. నిజాయితీ చాటుకున్న మహిళ

Author Icon By Sushmitha
Updated: October 28, 2025 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధురై: గుడిలో దేవుడిని దర్శించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఓ మహిళకు రోడ్డుపై నోట్ల కట్టలతో ఉన్న బ్యాగు దొరికింది. ఆ బ్యాగులో అన్నీ రూ.500 నోట్ల కట్టలే కనిపించాయి. ఇంతటి ధనాన్ని చూసి కూడా చలించకుండా ఆ మహిళ ఆ బ్యాగును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. పోలీసులు ఆమె నిజాయతీని అభినందించారు.

Read Also: Govt Negligence: తుఫాను సహాయక చర్యలపై వైసీపీ మండిపాటు

ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధురై సిమ్మక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళ మధురై మీనాక్షి అమ్మవారి(Madurai Meenakshi) ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా రోడ్డు మధ్యలో ఒక సంచి కనిపించింది. ఆ సంచిని పక్కకు తీయాలనే ఉద్దేశంతో దగ్గరకు వెళ్లగా, అందులో నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆమె సమీపంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచీని తీసుకెళ్లి అప్పగించింది.

రూ.17.5 లక్షల నగదు

సెల్వమాలిని ముందే ఆ సంచిని తెరిచి, పోలీసులు నోట్ల కట్టలను లెక్కించగా అందులో మొత్తం రూ.17.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. అంత భారీ మొత్తంలో నగదు ఉన్నప్పటికీ, చలించకుండా తీసుకొచ్చి తమకు అప్పగించిన సెల్వమాలిని నిజాయతీని పోలీసులు కొనియాడారు. కాగా, ఆ నోట్ల కట్టల బ్యాగు ఎవరిది, అక్కడ ఎందుకు ఉందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళకు ఎంత నగదు ఉన్న బ్యాగు దొరికింది?

బ్యాగులో మొత్తం రూ.17.5 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నగదు దొరికిన మహిళ ఎవరు?

మధురై సిమ్మక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళకు దొరికింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Honesty Latest News in Telugu lost cash Madurai Meenakshi Amman Temple police investigation. Rs 17.5 Lakhs Tamil Nadu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.