మధురై: గుడిలో దేవుడిని దర్శించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఓ మహిళకు రోడ్డుపై నోట్ల కట్టలతో ఉన్న బ్యాగు దొరికింది. ఆ బ్యాగులో అన్నీ రూ.500 నోట్ల కట్టలే కనిపించాయి. ఇంతటి ధనాన్ని చూసి కూడా చలించకుండా ఆ మహిళ ఆ బ్యాగును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. పోలీసులు ఆమె నిజాయతీని అభినందించారు.
Read Also: Govt Negligence: తుఫాను సహాయక చర్యలపై వైసీపీ మండిపాటు

ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధురై సిమ్మక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళ మధురై మీనాక్షి అమ్మవారి(Madurai Meenakshi) ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా రోడ్డు మధ్యలో ఒక సంచి కనిపించింది. ఆ సంచిని పక్కకు తీయాలనే ఉద్దేశంతో దగ్గరకు వెళ్లగా, అందులో నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే ఆమె సమీపంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచీని తీసుకెళ్లి అప్పగించింది.
రూ.17.5 లక్షల నగదు
సెల్వమాలిని ముందే ఆ సంచిని తెరిచి, పోలీసులు నోట్ల కట్టలను లెక్కించగా అందులో మొత్తం రూ.17.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. అంత భారీ మొత్తంలో నగదు ఉన్నప్పటికీ, చలించకుండా తీసుకొచ్చి తమకు అప్పగించిన సెల్వమాలిని నిజాయతీని పోలీసులు కొనియాడారు. కాగా, ఆ నోట్ల కట్టల బ్యాగు ఎవరిది, అక్కడ ఎందుకు ఉందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళకు ఎంత నగదు ఉన్న బ్యాగు దొరికింది?
బ్యాగులో మొత్తం రూ.17.5 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నగదు దొరికిన మహిళ ఎవరు?
మధురై సిమ్మక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళకు దొరికింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: