భారతదేశ వ్యవసాయ రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లిన ప్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్ (Professor M.S. Swaminathan) శత జయంతి పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుగా రూ.100 విలువగల నాణెాన్ని విడుదల చేయనుంది. భారతరత్నగా గౌరవించబడిన స్వామినాథన్ కు ఇది కేంద్రం తరఫున గౌరవప్రదమైన నివాళిగా పరిగణించవచ్చు. ఆయన సూచనలతో హరిత విప్లవం సాధ్యమై దేశం ఆహారభద్రతలో స్వయం సమృద్ధిని సాధించగలిగింది.
ప్రత్యేక నాణెం లక్షణాలు
ఈ ప్రత్యేక నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో, 35 గ్రాముల బరువుతో రూపొందించబడుతుంది. నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమాలుగా ఉంటాయి. ఇది స్మారక చిహ్నంగా నాణేబద్దమైన రూపంలో విడుదల కానుంది. ముఖ్యంగా ఇది నాణేల సేకరణలో ఆసక్తి ఉన్నవారికి, వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను గుర్తుచేసే మహత్తర గుర్తుగా నిలవనుంది.
వ్యవసాయ రంగంపై అమోఘ ప్రభావం
ఎం.ఎస్ స్వామినాథన్ అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల అభివృద్ధికి దోహదపడడమే కాకుండా, రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకూ విశేష కృషి చేశారు. దేశ వ్యాప్తంగా ఆయన సూత్రాలను అనుసరించి వ్యవసాయ విధానాలు రూపొందించబడ్డాయి. కేంద్రం ఈ నిర్ణయం ద్వారా కొత్త తరాలకు ఆయన సేవలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది. శత జయంతి వేళ విడుదల చేస్తున్న ఈ నాణెం భారత వ్యవసాయ చరిత్రలో ఓ ప్రత్యేక గుర్తుగా నిలుస్తుంది.
Read Also : Interest Subsidy : ఈనెల 18లోపు అకౌంట్లలో డబ్బులు జమ – సీఎం రేవంత్