ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్లినా పదవి (Position)లో ఉండటం ఇక కుదరదు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇప్పుడు దీనిపై గట్టి నిర్ణయం తీసుకుంది.ఒకరు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేదా కేంద్ర మంత్రి అయినా పరవాలేదు. ఐదేళ్ల శిక్ష వచ్చే అవకాశమున్న నేరాల్లో అరెస్టయి 30 రోజులు జైల్లో ఉంటే, వారి పదవి ఆటోమేటిగ్గా రద్దవుతుంది. 31వ రోజున వారే రాజీనామా చేయాలి. లేకపోతే, వారు ఇక అధికారంలో ఉండలేరు.ఇప్పటి దాకా, ఒక ప్రజాప్రతినిధి కోర్టు దోషిగా తేలితేనే పదవి పోతుంది. అరెస్టు అయినంత మాత్రాన, వారికి ఎలాంటి పదవీ ప్రభావం ఉండేది కాదు. ఇదే వ్యవస్థను మార్చాలని కేంద్రం భావించింది.ఈ కొత్త బిల్లు హత్య, పెద్దమొత్తం అవినీతిపై మాత్రమే వర్తిస్తుంది. చిన్ననాటి ఆరోపణలకూ, అసంబద్ధమైన కేసులకూ ఇది వర్తించదు. నిజంగా తీవ్ర నేరాలలో ఇరికినవారు లక్ష్యంగా తీసుకొచ్చిన చట్టమిది.

రాజ్యాంగ సవరణలు చేస్తూ ముందుకెళ్తున్నారు
ఈ చట్టాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదు. అందుకే ఆర్టికల్ 75, 164, 239AA మారుస్తున్నారు. ఈ మార్పులు చట్టబద్ధంగా ప్రక్రియను ముందుకు నడిపించేందుకు అవసరం.గతేడాది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ఆరు నెలలు జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడటానికే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది.చాలా సందర్భాల్లో మంత్రులు అరెస్టుకు ముందు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తుంటారు. కానీ అందరూ అలా చేయరని గతంలో చూశాం. అందుకే చట్టపరంగా చెక్ పెట్టాలనుకుంటోంది కేంద్రం.
మరో రెండు కీలక బిల్లులు కూడా సభలోకి
ఈ బిల్లుతో పాటు, కేంద్రం మరో రెండు బిల్లులు కూడా తీసుకురాబోతోంది. అవి:
కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు 2025.
జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025.
ఈ బిల్లులు పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ కొత్త చట్టంపై విపక్షాలు స్పందించలేదు. కానీ ఈ ఉదయం వారు వ్యూహంపై చర్చించేందుకు సమావేశమవుతున్నారు. స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Read Also :