📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే

Author Icon By Vanipushpa
Updated: January 29, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని అశ్వని వైష్ణవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమని అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమన్నారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు. ఈ రంగంలో స్వావలంభన సాధించాలనే విజన్‌కు అనుగుణంగా 2024-25 బడ్జెట్‌లో క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. అరుదైన ఖనిజ వనరులు ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడం, దేశీయంగా ఖనిజ నిల్వల అభివద్ధికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటీ కంపెనీలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రోత్సిహిస్తుందని మంత్రి చెప్పారు.

Ashwini Vaishnaw Cabinet meeting Minerals Mission

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.