📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 26, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CBI Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.

మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు

వాస్తవానికి భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణాలలో కొంతమంది అధికారులు దర్యాప్తు సంస్థల రాడార్‌లో కూడా ఉన్నారని సమాచారం. భూపేశ్ బాఘేల్ ఎక్స్‌ హ్యాండిల్ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీ భేటీకి మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణం

ఇటీవల, మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాఘేల్ నివాసంపై దాడి చేసింది. మార్చి 10న, లిక్కర్ స్కామ్ కేసులో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా దుర్గ్ జిల్లాలోని భిలాయ్ పట్టణంలోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల సమయంలో తన ఇంట్లోనే ఉన్న భూపేశ్ బాఘేల్ ఈడీ దాడికి సంబంధించి బీజేపీని విమర్శించారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం కుంభకోణం 2019- 2022 మధ్య జరిగింది. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌ను బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలించింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించిందని, మద్యం సిండికేట్ లబ్ధిదారులు రూ.2,100 కోట్లకు పైగా దోచుకున్నారని కేంద్ర ఏజెన్సీ గతంలో పేర్కొంది.

Breaking News in Telugu Former CM Bhupesh Baghel Google news Google News in Telugu Latest News in Telugu Liquor Scam Case Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.