ఇవాళ యాప్ ఆధారిత రవాణా సేవలకు చెందిన డ్రైవర్లు బంద్ (Cab Services) కు పిలుపునిచ్చారు. ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ వంటి యాప్లకు పనిచేస్తున్న కారు, ఆటో, బైక్ టాక్సీ డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి పలు జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ముఖ్యంగా అగ్రిగేటర్ సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలను నిర్ణయిస్తూ డ్రైవర్లను శ్రమదోపిడీకి గురిచేస్తున్నాయని యూనియన్ ఆరోపిస్తోంది.
Read Also: Digital Banking: SBI నుంచి IMPS ట్రాన్సాక్షన్లపై కొత్త సర్వీస్ ఛార్జీలు

తక్షణమే నిషేధం
‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్-2025’ అమల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కనీస ఛార్జీలను నోటిఫై చేయకపోవడం వల్ల డ్రైవర్ల ఆదాయం దారుణంగా పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రైవేట్ నంబర్ ప్లేట్ వాహనాలను కమర్షియల్ అవసరాలకు వాడటం వల్ల లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని, దీనిపై తక్షణమే నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: