మన దేశంలో వ్యాధుల ధోరణి మారుతోంది. ఒకప్పుడు అంటువ్యాధుల బెడద ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ తగ్గి డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఆటో ఇమ్యూన్ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాలంటే సాధారణ మందులు సరిపోవు. అత్యంత సంక్లిష్టమైన ‘బయోలాజికల్’ మందులు అవసరం. ఇలాంటి మందులను మన దేశంలోనే తయారు చేసి, సామాన్యులకు (Budget) తక్కువ ధరకే అందించడమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బయోఫార్మా శక్తి (Biopharma SHAKTI) పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Read Also: Rahul Gandhi: లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ అభ్యంతరం
10 వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
(Budget) ఈ పథకం కోసం వచ్చే 5 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘SHAKTI’ (Strategy for Healthcare Advancement through Knowledge, Technology and Innovation). అంటే కేవలం పేరు మాత్రమే కాదు, దాని వెనుక ఒక పెద్ద అర్థం ఉంది ఈ నిధులతో దేశంలో బయోలాజికల్ మందుల తయారీని పెంచడమే కాకుండా విదేశాల నుంచి వచ్చే మందులపై ఆధారపడటాన్ని తగ్గించనున్నారు.
మనం వాడే సాధారణ మాత్రలు రసాయనాలతో తయారవుతాయి. కానీ బయోలాజికల్ మందులు సజీవ కణాలు, బ్యాక్టీరియా లేదా జీవుల నుండి సేకరించిన ప్రోటీన్లు , జన్యువుల ద్వారా తయారవుతాయి. కేన్సర్, ఆర్థరైటిస్ వంటి కఠినమైన వ్యాధులకు ఇవే కీలకం. వీటి తయారీ , శుద్ధీకరణ చాలా ఖరీదైన వ్యవహారం. ఈ పథకం ద్వారా ఇలాంటి సంక్లిష్ట మందులను భారత్ తక్కువ ఖర్చుతో తయారు చేయబోతోంది.
కేవలం మందుల తయారీ మాత్రమే కాదు, పరిశోధనలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా..
- మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు.
- ఏడు పాత సంస్థలను అత్యాధునిక సౌకర్యాలతో అప్గ్రేడ్ చేస్తారు.
- దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ క్లినికల్ ట్రయల్ సైట్లను ఏర్పాటు చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: