📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

AP Budget Updates 2026:ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ మినరల్స్’ కారిడార్లు!

Author Icon By Siva Prasad
Updated: February 1, 2026 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Budget Updates 2026:దేశంలోని ఖనిజ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రాలను పారిశ్రామికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అరుదైన ఖనిజాల (Rare Earth Minerals) వెలికితీత, శుద్ధి మరియు పరిశోధనల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నాలుగు రాష్ట్రాల సహకారంతో ఒక ‘ప్రత్యేక మైనింగ్ మిషన్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

Read Also: Budget: కేంద్రానికి వచ్చే ఆదాయ వినియోగం: షేరు, వ్యయం, ప్రాధాన్యతలు

ఏపీ తీర ప్రాంతానికి మహర్దశ

ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో మోనజైట్, ఇల్మెనైట్ వంటి అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కొత్త కారిడార్ల ఏర్పాటు వల్ల ఏపీ తీర ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు పెరగడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు రక్షణ రంగాలకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత సులభతరం కానుంది. దీనివల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు మరియు ఉదాహి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

AP Budget Updates 2026: ‘Rare Earth Minerals’ corridors in 4 states, including Andhra Pradesh.

ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్

భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ‘ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్’ను నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 10,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కంటెయినర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్న భారత్, ఈ నిర్ణయంతో ఎగుమతుల రంగంలో స్వయం సమృద్ధి సాధించనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Mining AP Budget Updates 2026 Budget 2026 Container Manufacturing Corporation India Mining News Telugu Nirmala Sitharaman Rare Earth Corridor Rare Earth Minerals Mission

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.