ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4జీ సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో ఈ సేవలు దేశవ్యాప్తంగా వినియోగదారులకు లభ్యం కానున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను తీసుకురావడం గమనార్హం.
Secunderabad: ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదాల భయం
దేశవ్యాప్తంగా 98 వేల సైట్లలో సేవలు
ఈ 4జీ సేవలు ఒక క్లౌడ్ ఆధారిత నెట్వర్క్(network) అని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 5జీకి సులువుగా అప్గ్రేడ్ అయ్యే సామర్థ్యం దీనికి ఉందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రారంభోత్సవ వివరాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఒడిశాలోని జార్సుగూడా నుంచి ఈ నెట్వర్క్ను ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో గౌహతిలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొననున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ప్రారంభోత్సవం ఒకేసారి జరగనుంది.
బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
సెప్టెంబర్ 27న (శనివారం) ఈ సేవలు దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయి.
4జీ నెట్వర్క్ను ఎవరు ఆవిష్కరించనున్నారు?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని జార్సుగూడా నుంచి ఈ నెట్వర్క్ను ఆవిష్కరించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: