हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bombay HighCourt: భార్య ప్రవర్ధన సరిగ్గాలేదన్న సాకుతో DNA పరీక్ష చేయలేం: హైకోర్టు

Anusha
Bombay HighCourt: భార్య ప్రవర్ధన సరిగ్గాలేదన్న సాకుతో DNA పరీక్ష చేయలేం: హైకోర్టు

భార్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఉన్నప్పటికీ, మైనర్ పిల్లలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని బలవంతం చేయడం సరికాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.కుటుంబ వివాదాల పరిణామంలో పిల్లల హక్కులు, గోప్యతకు మించి మరేదీ లేదని పేర్కొంటూ, ఇటువంటి చర్యలు అసాధారణ పరిస్థితుల్లోనే తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.నాగ్‌పూర్ బెంచ్ ఈ తీర్పును ఇటీవల ఒక విచారణ సందర్భంలో వెల్లడించింది.2013లో విడిపోయిన ఓ దంపతుల వివాదంలో, భర్త తన భార్యపై వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ, ఆ జంటకు జన్మించిన బిడ్డ తనదా, కాదా అని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్ష (DNA test) లు చేయాలని కోర్టును ఆశ్రయించాడు.పూర్తివివరాలు,2011 డిసెంబర్ 18వ తేదీన ఓ జంట వివాహం చేసుకుంది. అయితే రెండేళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగగా, భార్య గర్భం దాల్చింది. ఆమె మూడు నెలల గర్భవతిగా ఉండగా అంటే 2013 జనవరి నెలలో వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా, ఆమె పుట్టింటికి వచ్చేసింది. జులై నెలలో బిడ్డ జన్మించింది.

DNA పరీక్ష చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు

అయితే బిడ్డ పుట్టిన తర్వాత భర్త, భార్యపై వివాహేతర సంబంధం, క్రూరత్వం, తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందని ఆరోపిస్తూ, విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదట్లో ఆయన బిడ్డ పితృత్వాన్ని సవాలు చేయలేదు. కానీ 2020 విచారణ సమయంలో అతను బిడ్డకు DNA పరీక్ష చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును నాగ్‌పూర్ కుటుంబ కోర్టు అనుమతి ఇచ్చింది.ఈక్రమంలోనే భర్త DNA ప్రొఫైలింగ్ అభ్యర్థనను అనుమతించాలన్న కుటుంబ న్యాయస్థానం నిర్ణయాన్ని సవాలు చేస్తూ, భార్య బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించింది. దీంతో బుధవారం రోజు న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. జోషి మాట్లాడుతూ, కుటుంబ న్యాయస్థానం అభ్యర్థనను మంజూరు చేయడంలో వాస్తవాలతో పాటు చట్టంలోనూ స్పష్టంగా తప్పు చేసిందని పేర్కొన్నారు. భర్త ఏ అధికారిక వాదనల్లోనూ పితృత్వాన్ని ఎప్పుడూ తిరస్కరించలేదని ఎత్తి చూపారు. కుటుంబ కోర్టు 2020లో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేశారు.

Bombay HighCourt: భార్య ప్రవర్ధన సరిగ్గాలేదన్న సాకుతో DNA పరీక్ష చేయలేం: హైకోర్టు
Bombay HighCourt: భార్య ప్రవర్ధన సరిగ్గాలేదన్న సాకుతో DNA పరీక్ష చేయలేం: హైకోర్టు

అత్యంత ప్రధానమని

అలాగే భర్త పిల్లల పితృత్వాన్ని అధికారికంగా నిరాకరించనప్పుడు డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించడం సమర్థనీయం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని భార్య చేసిన సాధారణ ప్రకటన, డీఎన్‌ఏ పరీక్షకు ఆమె సమ్మతించినట్లుగా పరిగణించబడదని పేర్కొంది. పిల్లల ప్రయోజనాలు అత్యంత ప్రధానమని, వారిని బలవంతంగా డీఎన్‌ఏ పరీక్షకు గురిచేయకూడదని కోర్టు నొక్కి చెప్పింది. భారత సాక్ష్య చట్టంలోని సెక్షన్ 112 కింద చెల్లుబాటు అయ్యే వివాహం ద్వారా జన్మించిన బిడ్డ చట్టబద్ధమైన సంతానంగా పరిగణించబడుతుందని హైకోర్టు పునరుద్ఘాటించింది.ఈ చట్టపరమైన ఊహను సవాల్ చేయాలంటే, బిడ్డ గర్భం ధరించే సమయంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన, బలమైన, నిర్ణయాత్మకమైన సాక్ష్యాధారాలు ఉండాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా హైకోర్టు ఉదహరించింది.

పిల్లలపై దృష్టిని

డీఎన్‌ఏ పరీక్షలు అత్యవసరమైతే మాత్రమే చేయాలని, కోర్టు నొక్కి చెప్పింది. కేవలం భార్యపై ఉన్న అనుమానంతో పిల్లలను ఇటువంటి మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేయడం సరికాదని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు కుటుంబ న్యాయవాదులు, విడాకుల కేసుల్లో ఉన్న తల్లిదండ్రులకు ముఖ్యమైన మార్గదర్శకంగా మారనుంది. పిల్లల హక్కులు (Children’s rights), ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే సూత్రాన్ని ఈ తీర్పు మరోసారి బలపరిచింది.ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న వివాహిత కుటుంబాల మధ్య నడిచే చట్టపరమైన తగాదాల్లో పిల్లలపై దృష్టిని మార్చేలా ఉంది. ఇది ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది: తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల బిడ్డలు బాధపడకూడదు. వారి వ్యక్తిత్వం, గోప్యత, మానసిక స్థితిని హానిచేయకూడదు. ఈ తీర్పు పిల్లల హక్కులను ముందుపెట్టి, వారి మనోభావాలను గౌరవించేలా న్యాయ వ్యవస్థ తీసుకున్న ఓ మంచితీర్మానం.

బాంబే హైకోర్టు ఎప్పుడు స్థాపించబడింది?

బాంబే హైకోర్టు 14 ఆగస్టు 1862న స్థాపించబడింది.

బాంబే హైకోర్టు తీర్పులు ఎందుకు ప్రాముఖ్యత పొందుతాయి?

బాంబే హైకోర్టు భారతదేశంలో పురాతనమైన, అత్యంత ప్రభావవంతమైన హైకోర్టులలో ఒకటి. దీని తీర్పులు అనేక సామాజిక, రాజకీయ,చట్టపరమైన విషయాలపై మార్గదర్శకంగా ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: US VISA: యూఎస్ వెళ్లాలనుకునే వారికి ట్రంప్ బిగ్ షాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870