సమీప కాలంలో ప్రముఖులు, టాప్ సెలబ్రెటీలపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు పౌర సమాజాన్ని కుదిపేస్తూ, భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం (MK Stalin residence), బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP Tamil Nadu office),
Maoists : మావోయిస్టులకు భారీ షాక్
స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ (Trisha Krishnan house) ఇల్లు, అలాగే రాజ్భవన్ వంటి ముఖ్యమైన ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ (Bomb threat calls) రావడం సంచలనం సృష్టించింది. ఈ కాల్స్ గురువారం సాయంత్రం నుంచి వరుసగా రావడంతో చెన్నై నగరంలో (Chennai city) భద్రతా పరిస్థితులు కఠినతరమయ్యాయి.

చెన్నై పోలీసులు వెంటనే బాంబు డిటెక్షన్ స్క్వాడ్ను
ఈ ఘటనలు చెన్నైలో భద్రతా పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేశాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.చెన్నై (Chennai) పోలీసులు వెంటనే బాంబు డిటెక్షన్ స్క్వాడ్ను, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి తనిఖీలు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు దొరకలేదని తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్ త్రిషా తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చెన్నైలోని సెనోటాఫ్ రోడ్డు ప్రాంతంలో త్రిష నివసిస్తుంది. ఈ ప్రాంతం సీఎం స్టాలిన్ ఇల్లు ఉన్న చిత్తరంజన్ రోడ్కు సమీపంలో ఉంది. ఈ బెదిరింపులు రాజకీయ, సినిమా ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి
పోలీసులు ఈ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి దించారు.ఇటీవల తమిళనాడులో బాంబు బెదిరింపులు పెరిగాయి. జులై 27న స్టాలిన్ ఇంటికి వచ్చిన బెదిరింపులు ఆకతాయిలు చేశారని తేలింది.
ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ఇక ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకుంది. నిందితులను పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: