📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bomb-ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుల కలకలం

Author Icon By Pooja
Updated: September 12, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bomb: ఇటీవల తరచూ బాంబుల బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీలో గతనెలలో పలు స్కూల్లో బాంబులు పెట్టామని బెదిరింపులు రావడంతో పోలీసులు హుటాహుటిగా ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు. చివరికి ఇదంతా ఉత్తిత్తే అని తేల్చేశారు. గతంలో విమానాల్లో కూడా బాంబుల కలకలం రేగింది. ఇటీవల ఇలాంటి బాంబుల బెదిరింపుల సంఖ్య పెరిగిపోతున్నాయి. వీటికి హద్దు ఉండడం లేదు. తాజాగా ఢిల్లీలోని హైకోర్టుకు(high Court) బాంబు బెదిరింపులు వచ్చాయి. మూడుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టామంటూ.. మధ్యాహ్నం రెండు గంటలలోపు కోర్టును ఖాళీ చేయకపోతే పేల్చేస్తామంటూ మెయిల్లో హెచ్చరించారు. వెంటనే స్పందించిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎంత వెతికినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ఇదంతా ఫేక్ గా తేల్చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

బెదిరింపులతో భయానక వాతావరణం

ఈ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టుకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లో మేం కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులు అమర్చాం. మరికాసేపట్లో అవి పేలతాయి’ అని బెదిరించారు. అంతేకాకుండా మధ్యాహ్నం 2గంటలలోపు కోర్టును ఖాళీ చేయాలని అందులో స్పష్టంగా పేరొ న్నారు. అయితే ఏఏప్రాంతాల్లో పేలుడు పదార్థాలు పెట్టారనేది మెయిల్ లో పేర్కొనలేదు. ఈ బెదిరింపు మెయిల్ తో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అధికారులు

సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు వచ్చారు. న్యాయమూర్తులు, సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. పాంగణమంతా ఒక్కసారిగా ఖాళీ అయ్యింది. నిమిషాల వ్యవధిలోనే కోర్టు బయట భారీగా భద్రతాసిబ్బంది మోహరించారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో ఇది ఫేక్ అని పోలీసులు తేల్చేశారు. తనిఖీలో భాగంగా కోర్టు అమూల్యమైన సమయం వృధా అయ్యింది. ముఖ్యమైన విచారణలు, కేసుల వాదనలు వాయిదాపడ్డాయి. ఇప్పటికైనా తమకు న్యాయం(Justice) జరుగుతుందనే ఆశతో తమ కేసుల పరిష్కారం కోసం వచ్చిన వందలాదిమంది ప్రజలు ఊసురోమంటూ వెనుతిరిగివెళ్లారు.

కాల్ చేసిన వ్యక్తి పట్టుబడ్డాడా?
ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటున్నారు?
హైకోర్టు పరిసరాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

Telugu News: Karnataka-పరిహారం కోసం  భర్తను హతమార్చి .. ఆపై పులిపైకి నెట్టేసిన భార్య!

Breaking News in Telugu Delhi bomb scare Delhi High Court bomb threat Delhi police bomb squad fake bomb call Delhi High Court security alert Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.