సమగ్ర రాజకీయ విశ్లేషణ సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్’ (ADR) తాజా నివేదిక ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆదాయం ఆకాశాన్నంటింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 7,960 కోట్లుగా నమోదవగా, అందులో సింహభాగం అంటే దాదాపు 85 శాతం (రూ. 6,769 కోట్లు) ఒక్క బీజేపీకే దక్కడం గమనార్హం.
Read Also : AP Tourism: దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్ కమ్ గైడ్’ విధానం
గత ఏడాదితో పోలిస్తే పార్టీ ఆదాయంలో భారీ వృద్ధి కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రూ. 918 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, సీపీఎం (రూ. 172 కోట్లు), బీఎస్పీ (రూ. 58.5 కోట్లు), ఆమ్ ఆద్మీ పార్టీ (రూ. 39 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలు దేశ రాజకీయ నిధుల్లో అధికార బీజేపీ ఏ స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందో స్పష్టం చేస్తున్నాయి.వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడంలోనూ బీజేపీ ముందంజలో ఉంది. పార్టీకి అందిన మొత్తం ఆదాయంలో 55.76 శాతం (సుమారు రూ. 3,774 కోట్లు) ఎన్నికల ప్రచారం, పార్టీ నిర్వహణ మరియు ఇతర కార్యక్రమాల కోసం వెచ్చించినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో అడ్వర్టైజ్మెంట్లు, ప్రయాణ ఖర్చులు మరియు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఈ నిధులను భారీగా ఉపయోగించారు. విరాళాల రూపంలో అందిన ఈ నిధులు రాజకీయ పార్టీల ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తుండగా, ఇతర జాతీయ పార్టీల ఆదాయంతో పోలిస్తే బీజేపీకి వస్తున్న నిధులు దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :