Palaniswami : నేనే ముఖ్యమంత్రిని అని బీజేపీ చెప్పింది : పళనిస్వామి

Read Time:  1 min
Palaniswami : నేనే ముఖ్యమంత్రిని అని బీజేపీ చెప్పింది : పళనిస్వామి
FONT SIZE
GET APP

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. బీజేపీతో కలిసే అంశంపై అన్నాడీఎంకే తుది తీర్మానం తీసుకుంది.కూటమి గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని పళనిస్వామి (Palaniswami) స్పష్టం చేశారు. బీజేపీ కూడా అదే విషయాన్ని అంగీకరించిందని పేర్కొన్నారు. తమ పార్టీనే కూటమికి నాయకత్వం వహిస్తుందని చెప్పారు. ఇది తన తుది నిర్ణయమని వెల్లడించారు.ఇన్నాళ్లుగా బీజేపీతో పొత్తుపై గందరగోళం కొనసాగింది. అయితే ఇప్పుడది ముగిసినట్టు పళనిస్వామి సంకేతాలిచ్చారు. గెలిచినా ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని బీజేపీకి ముందుగా షరతు పెట్టినట్టు చెప్పారు.

Palaniswami : నేనే ముఖ్యమంత్రిని అని బీజేపీ చెప్పింది : పళనిస్వామి
Palaniswami : నేనే ముఖ్యమంత్రిని అని బీజేపీ చెప్పింది : పళనిస్వామి

గత ఎన్నికల్లో పొత్తు – ఇప్పుడు మారిన గేమ్

2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–అన్నాడీఎంకే కలసి పోటీ చేశాయి. కానీ 2023లో అనాథమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయలలితపై అనుచిత వ్యాఖ్యలతో అన్నామలైపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నామలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తే ఎన్డీయేలో ఉండబోమని అన్నాడీఎంకే ప్రకటించింది. దీంతో గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. దీనివల్ల డీఎంకేకు లాభం చేకూరిందని విశ్లేషకుల అభిప్రాయం.

ఇప్పుడేమైంది? బీజేపీ వెనక్కి తగ్గింది

ఇటీవల బీజేపీ అన్నామలైను పక్కనబెట్టింది. దీని తర్వాత పరిస్థితులు మారాయి. తిరిగి అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో కూటమి చర్చలు తిరిగి మొదలయ్యాయి.ఇప్పుడు రెండు పార్టీలు ఒక్కటిగా ఎన్నికలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ కూటమికి పళనిస్వామి నాయకత్వం వహించనున్నారు. తమ లక్ష్యం ఒక్కటే – డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించడం.

Read Also : Chandrababu : ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.