हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

BJP leader : 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన బీజేపీ నేత

sumalatha chinthakayala
BJP leader : 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన బీజేపీ నేత

BJP leader : బీజేపీ పార్టీకి చెందిన దిలీప్‌ ఘోష్‌ పెళ్లి పీటలెక్కారు. అదే పార్టీకి చెందిన మహిళను మనువాడారు. వీరి వివాహానికి పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా వేదికైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌ వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. అయితే ఇప్పటి వరకూ ఆయన పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉన్నారు. అదే పార్టీకి చెందిన 51 ఏళ్ల రింకూ మజుందార్‌ తో దిలీప్‌కు 2021లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో వరు శుక్రవారం కోల్‌కతా లోని దిలీప్‌ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

దిలీప్‌కు ఇది మొదటి వివాహం

వివాహం అనంతరం దిలీప్‌ ఘోష్‌ మీడియాతో మాట్లాడారు. తన తల్లి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఇక దిలీప్‌కు ఇది మొదటి వివాహం కాగా, రింకూ మజుందార్‌కు ఇది రెండో వివాహం. ఆమెకు ఇప్పటికే ఓ కుమారుడు కూడా ఉన్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, పలువురు నేతలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

పలువురు టీఎంసీ నేతలు కూడా అభినందనలు

ఇక, ఈ వివాహ వేడుకకు పలువురు బీజేపీ నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు బొకేలు పంపించి ఓ లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీఎంసీ నేతలు కూడా అభినందనలు తెలియజేశారు. కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఘోష్.. 2015 నుంచి 2021 వరకు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Read Also: వివాహేతర సంబంధం నేరం కాదు – ఢిల్లీ హైకోర్టు తీర్పు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870