📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

BJP Government: గుజరాత్‌లో టీచర్లకు వీధి కుక్కల సర్వే బాధ్యత

Author Icon By Pooja
Updated: February 13, 2026 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం(BJP Government) తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. పాఠశాలల ప్రాంగణాల్లో, పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వీధి కుక్కల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఈ నెల 11న సర్క్యులర్ జారీ చేసి, మూడు రోజుల్లోనే సర్వే పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనలను కారణంగా చూపుతూ దీనిని అత్యవసర చర్యగా ప్రభుత్వం పేర్కొంది.

Read Also: BJP: రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలని దూబే డిమాండ్

BJP Government: Teachers in Gujarat are responsible for surveying stray dogs

ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. కాంగ్రెస్ విమర్శలు

ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బోధనతో పాటు ఎన్నికల విధులు, సర్వేలు, ప్రభుత్వ (BJP Government)కార్యక్రమాల పనులతో తాము ఒత్తిడిలో ఉన్నామని వారు వాపోతున్నారు. మరుగుదొడ్ల లెక్కింపు నుంచి జనసమీకరణ వరకు అనేక విద్యేతర పనులు అప్పగించడం వల్ల అసలు బోధనకు సమయం దొరకడం లేదని విమర్శిస్తున్నారు. వీధి కుక్కల గణన కూడా తమకే అప్పగించడం ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని తగ్గించే చర్యగా వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి మాట్లాడుతూ, ఉపాధ్యాయులను డేటా సేకరణ యంత్రాలుగా మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ సర్వే ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యా ప్రమాణాలు దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

EducationDepartment Google News in Telugu Latest News in Telugu StreetDogSurvey TeacherProtest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.