ఢిల్లీలో బీజేపీ(BJP Government) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అలాగే ఢిల్లీ–పానిపట్ మధ్య కొత్త బస్ సర్వీసులను ప్రారంభించారు.
Read Also: Apple Innovation: యాపిల్ AI పిన్… స్మార్ట్ఫోన్ యుగానికి కొత్త సవాల్?
ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడీ మంత్రి పర్వేష్ వర్మ, బీజేపీ(BJP Government) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొని ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభించినట్లు నేతలు తెలిపారు. నగర రవాణా వ్యవస్థను పర్యావరణ హితంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: