📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

గెలుపు దిశ గా బీజేపీ!

Author Icon By Anusha
Updated: February 8, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గెలుపు దిశ గా బీజేపీ.ప్రస్తుతం ఫలితాలు చూస్తే బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 36 స్థానాల మెజార్టీ మార్క్‌ను దక్కించుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. 1993లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడు దశాబ్ధాల తర్వాత మరోసారి ఢిల్లీ శాసనసభలో అధికారాన్ని దక్కించుకోబోతుంది. 2014లో కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈసారి ఎలాగైనా ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ పనిచేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసారి ఢిల్లీ ఎన్నికలను తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ ప్రధాని ఢిల్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేదు. ఈసారి మాత్రం తన పంతం నెగ్గించుకోవాలనే పట్టదలతో తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనుంది. 1993లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులను మార్చింది.

గెలుపు దిశ గా బీజేపీ.ఢిల్లీలో అధికారంలోకి రావడమే కాదు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీచేసిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్‌ను పోటీకి నిలిపింది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ పర్వేష్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా జాట్ సామాజికవర్గానికి చెందిన ఆయనను సీఎం చేస్తారనే ప్రచారం ద్వారా ఆ సామాజికవర్గం ఓట్లను బీజేపీ ఎక్కువుగా ఆకర్షించింది. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే కేజ్రీవాల్‌పై ఆయన ఆధిక్యం కనబరుస్తున్నారు. పర్వేష్ గెలిస్తే మాత్రం ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. 1996 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 1998 అక్టోబర్ 12 వరకు పర్వేజ్ తండ్రి సాహిబ్ సింగ్‌ వర్మ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం పర్వేష్ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

AAP BJP Breaking News in Telugu delhi elections results counting Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.