Latest News: Bihar Elections 2025: బిహార్‌ మొదటి దశ పోలింగ్.. ఓటేసిన నితీష్

Read Time:  1 min
Bihar Elections 2025
Bihar Elections 2025
FONT SIZE
GET APP
Bihar Elections 2025
Bihar Elections 2025

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections 2025) ప్రశాంతంగా జరుగుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఇవాళ ఓటింగ్‌ జరుగుతోంది. సుమారు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమిషన్‌ సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల వరకు 27 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ దశలో 45,341 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

Read Also: Coimbatore Crime: దూమారం రేపుతున్న డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections 2025) మొదటి దశలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఓటు వేశారు. భక్తియార్‌పూర్‌లోని మంజు సిన్హా ప్రాజెక్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (Deputy CM Samrat Chaudhary) ఓటు వేశారు.

తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఓటు వేశారు. చౌదరి దాదాపు దశాబ్దం తర్వాత బీజేపీ టికెట్‌పై తారాపూర్ నుండి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఇక ఈ ఎన్నికల్లో 57 స్థానాల్లో JDU, 48 స్థానాల్లో బీజేపీ, 14 స్థానాల్లో LJP పోటీ చేస్తుంది.  8 స్థానాల్లో లోక్‌మోర్చా బరిలో నిలిచింది. మరోవైపు 73 స్థానాల్లో RJD, 24 స్థానాల్లో కాంగ్రెస్,  14 స్థానాల్లో CPI-ML అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ నుంచి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.