हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bihar: కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు

Anusha
Bihar: కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు

బీహార్‌లో చోటుచేసుకున్న అరుదైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బెట్టియాహ్ జిల్లా (Bettiah District) లోని ఓ చిన్న గ్రామంలో, ఓ ఏడాది వయస్సున్న చిన్నారి నాగుపామును (Cobra) కొరికి చంపిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇది ఏదైనా సినిమాలో జరిగిన సీన్ కాదు, నిజంగా జరిగిన వాస్తవం.

ఘటన ఎలా జరిగింది?

బెట్టియాహ్ జిల్లాలోని ఓ గ్రామంలో గోవిందా అనే ఏడాది చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఓ కోబ్రా పాము అక్కడికి వచ్చి అతడి చేతిపై చుట్టుకుంది. ఆ చిన్నారి ఆ పామును ఒక బొమ్మ అని భావించి, భయపడకుండా అర్ధం లేకుండా దాన్ని బలంగా కొరికాడు. చిన్నారి కాటు తీవ్రమై, ఆ విషపూరిత పాము అక్కడికక్కడే మృతి చెందింది.

కుటుంబ సభ్యుల ఆందోళన

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే గోవిందా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహాతో గోవిందాను బెట్టియాహ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌ (GMCH) కు తరలించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయనను ఐసీయూలో వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు చెప్పారు.

గ్రామస్థుల స్పందన

చిన్నారి తల్లి కట్టెల కోసం ఇంటి పక్కనే ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని.. అప్పుడు ఆమెను పిలిచి సమాచారం అందించామని గోవిందా (Govinda) బామ్మ మతేశ్వరి దేవి చెప్పారు. ఈ ఘటన గ్రామంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంత చిన్నోడు నాగుపామును ఎలా చంపగలిగాడో అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

పూర్తిగా కోలుకోవాలని

ఈ అరుదైన ఘటనను ఆసక్తిగా చూస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. గోవిందా పూర్తిగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి మనకు తెలియజేసింది – జీవితం అనేది అంచనాలకు అతీతం. పిల్లలు దైవస్వరూపం అంటారు. ఈ చిన్నారి ఘనత చూస్తే నిజంగా అలా అనిపిస్తుంది.

బీహార్ రాష్ట్రాన్ని స్థాపించినవారు ఎవరు?

బీహార్ ప్రాంతానికి వేల ఏళ్ల చరిత్ర ఉన్నా, ఆధునిక బీహార్ రాష్ట్రం మార్చ్ 22, 1912న బంగాల్ ప్రెసిడెన్సీ నుండి విడదీయబడి ఏర్పడింది. దీనిని ఆధునిక బీహార్‌గా పరిగణిస్తారు.బీహార్ రాష్ట్రాన్ని స్థాపించినవారు,చంద్రగుప్త మౌర్యుడు.

బీహార్ సింహం (Lion of Bihar) ఎవరు?

బీహార్ సింహం అనే బిరుదు శ్రీ కృష్ణ సింహా గారికి ఇవ్వబడింది. ఆయనను ప్రజలు గౌరవంగా “బీహార్ కేసరి” (Bihar Kesari) అని కూడా పిలిచేవారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Crime: కదులుతున్న అంబులెన్స్ లో యువతిపై సామూహిక అత్యాచార

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870