బీహార్ ఎన్నికల ఫలితాలు (Bihar Results) కొందరికి ఆనందం మరొకొందరికి విషాదం. కానీ ఆర్జేడీ మరీ ఇంతగా ఓటమిని చవిచూస్తుందని ఊహించలేదు. బీహార్ ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. నితీష్ కుమార్ కే (Nitish Kumar) తమ జేజేలు పలికారు. ఆయన పాలనకే తమ మద్దతు అంటూ తీర్పునిచ్చారు. ఓటమి భారంతో కృంగీపోతున్న ఆర్జేడీ కుటుంబంలో అప్పుడే కుటుంబ అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారై ఆ కుటుంబంతో తెగతెంపులు చేసుకోవడం మాత్రమేకాక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక ఆర్జేడీ పార్టీ ఓటమి తర్వాత ఈవిధంగా ప్రకటన చేసింది.. ‘ఎన్నికల్లో గెలుపుఓటములు సహజమేనని, ప్రజలకు అండగా ఉంటామని’ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రకటించింది.
Read Also: Latest news: AP: విశాఖలో గోమాంసం నిల్వలపై పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు

బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆ పార్టీ తొలిసారిగా ఫలితాలపై స్పందించింది. ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఒడుదొడుకులు సహజం. ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు. ఆర్జేడీ పేదల
పార్టీ. వారి మధ్య ఉంటూ.. వారి గొంతుకను వినిపిస్తూనే ఉంటుంది’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది ఆ పార్టీ. ఈ ఎన్నికల్లో మహాగర్ బంధన్ కు 34 సీట్లు రాగా ఇందులో ఆర్జేడీ 25 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది.
ఆటవిక రాజ్యానికి భయపడే ఎన్డీఏకీ మద్దతు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీ చేసిన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఆ పార్టీ స్పందించింది. ఆర్జేడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆటవిక రాజ్యం తప్పదనే భయంతో తమకు మద్దతుగా నిలవాల్సిన వారిలో అనేకులు ఎన్డీయే వైపు మొగ్గు చూపారని చెప్పింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: