బీహార్లో అసెంబ్లీ( Bihar Results) ఎన్నికల ఫలితాల లెక్కింపు కొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. మరో కొన్ని గంటల్లో మొత్తం పిక్చర్ స్పష్టమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే చాలా వరకు అధికార ఎన్డీయే కూటమికే అనుకూలంగా కనిపించినప్పటికీ, అసలు ఫలితాలపై ఆసక్తి, ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది.
1951 నుంచి ఇప్పటి వరకు బీహార్లో జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్. 67.13 శాతం ఓటింగ్ నమోదవడం చారిత్రాత్మక రికార్డ్గా నిలిచింది. అభివృద్ధి వర్సెస్ ఆటవిక పాలన అంటూ ఎన్డీయే ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటికీ, ఉపాధి, ఓట్ల దోపిడీ వంటి అంశాలతో మహాగఠ్బంధన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార కూటమికే స్పష్టమైన ఆధిక్యాన్ని సూచించాయి.
Read Also: Bihar Elections: మహాఘట్ బంధన్ను వెనక్కి లాగుతున్న కాంగ్రెస్
రెండు దశల్లో పోలింగ్
బీహార్ అసెంబ్లీలో( Bihar Results) మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. వీటిలో రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్ సీట్లు. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ లేదా కూటమి అయినా కనీసం 122 సీట్లు సాధించాలి. మొత్తం ఓటర్ల సంఖ్య 7.45 కోట్లు పురుషులు 3.92 కోట్లు, మహిళలు 3.50 కోట్లు.
ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. రెండు దశల్లోనూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పురుషుల పోలింగ్ 62.98%, మహిళల పోలింగ్ 71.78% గా నమోదైంది.
మొదటి దశ (నవంబర్ 6):
- 121 సీట్లకు పోలింగ్
- 3.75 కోట్ల మంది ఓటర్లు
- 1,314 మంది అభ్యర్థులు
- 65% కంటే ఎక్కువ పోలింగ్
రెండో దశ (నవంబర్ 11):
- 112 సీట్లకు ఓటింగ్
- 3.70 కోట్ల మంది ఓటర్లు
- 1,302 అభ్యర్థులు
- 69% పైగా పోలింగ్
కూటములు – కీలక అభ్యర్థులు
ఎన్డీయే:
- జేడీయూ – 101
- బీజేపీ – 101
- లోక్జనశక్తి (రాంవిలాస్) – 28
- హిందుస్థానీ అవామ్ మోర్చా – 06
- రాష్ట్రీయ లోక్మోర్చా – 06
మఢౌరాలో లోక్జనశక్తి అభ్యర్థి నామినేషన్ రద్దు కావడంతో, స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్కు ఎన్డీయే మద్దతిచ్చింది.
మహాగఠ్బంధన్:
- ఆర్జేడీ – 143
- కాంగ్రెస్ – 61
- సీపీఐ (ఎంఎల్) – 20
- విఐపీ – 12
- సీపీఐ – 09
- సీపీఎం – 04
ఇతర చిన్న పార్టీలతో సహా పలువురు స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు.
కీలక నియోజకవర్గాల్లో ప్రముఖులు:
తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ – రాఘోపుర్),
సామ్రాట్ చౌదరీ (బీజేపీ – తారాపుర్),
విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ – లఖిసరాయ్),
తేజ్ప్రతాప్ యాదవ్ (జేజేడీ – మహువా) తదితరులు.
బీహార్ ఎన్నికల తాజా ట్రెండ్స్ – ఎన్డీయే దూకుడు
ప్రాథమిక లెక్కింపులు చూస్తే ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 122ని దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనిస్తోంది.
తాజా ఎర్లీ ట్రెండ్స్
- ఎన్డీయే: 130+ స్థానాల్లో ఆధిక్యం
- మహాగఠ్బంధన్: దాదాపు 65 స్థానాల్లో ఆధిక్యం
- జన్ సూరజ్: 3 సీట్లలో ఆధిక్యం
ఎన్డీయే కూటమిలో:
- బీజేపీ – 59
- జేడీయూ – 54
- మిగతా స్థానాలు మిత్రపక్షాల ఖాతాలో
మహాగఠ్బంధన్లో:
- ఆర్జేడీ – 43
- కాంగ్రెస్ – 11
- లెఫ్ట్ పార్టీలు – 10
లెక్కింపు కొనసాగుతోంది, కానీ ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ చూస్తే మరోసారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం బలంగా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: