బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో(Bihar Results) మహాకూటమికి వచ్చిన పరాజయం అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్(Lalu Prasad) యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అనూహ్య నిర్ణయం ప్రకటించారు. ఎన్నో విమర్శలు, కుటుంబ అంతర్గత ఒత్తిడుల నడుమ, రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు, అంతేగాక తన కుటుంబంతో కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నింద అంతా నేను తీసుకుంటాను అని రాసిన ఆమె పోస్టు ఆర్జేడీ కుటుంబంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన తీవ్ర అంతర్గత ఉద్రిక్తతలను బయటపెట్టింది. లాలూ కుమార్తె తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో బీహార్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
Read also: AI పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
కుటుంబ కలహాల నేపథ్యమేనా? రోహిణి చేసిన ఆరోపణలు చర్చనీయాంశం
తన రాజకీయ విరమణకు సంబంధించి రోహిణి(Bihar Results) చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సంజయ్ యాదవ్ మరియు రమీజ్ అనే ఇద్దరు వ్యక్తులు పెట్టిన ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఇద్దరు ఎవరనే విషయంపై, లాలూ కుటుంబంలో నిజంగా ఏం జరుగుతోంది అన్న అంశంపై వివిధ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సారన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రోహిణి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కుటుంబ సభ్యులు లేదా పార్టీ నేతలు తనపై ఒత్తిడి తెచ్చారా? అనే ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఆర్జేడీ కుటుంబంలో వారసత్వం నాయకత్వంపై విభేదాలు ఉన్నాయన్న చర్చలు ఉండగా రోహిణి తీసుకున్న ఈ అడుగు ఆ అంతర్గత అసమ్మతులను మరింత బహిర్గతం చేసినట్లైంది. ప్రస్తుతం రోహిణి చేసిన ఆరోపణలపై లాలూ కుటుంబం, ఆర్జేడీ నాయకత్వం లేదా తేజస్వి యాదవ్ ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఆమె చేసిన నిందనంతా నా పైకి తీసుకుంటున్నాను అనే ప్రకటన ఈ వివాదం త్వరగా ముగిసేలా కనిపించడం లేదని సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: