📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bihar Results: నిజమౌతున్న ఎగ్జిట్ పోల్స్ ..ఎన్డీఏ విజయం

Author Icon By Tejaswini Y
Updated: November 14, 2025 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Bihar Results) లెక్కింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తోంది. మొత్తం 38 జిల్లాల్లోని 243 స్థానాలకు రెండువిడతలలో పోలింగ్ జరగగా, ఫలితాల ప్రక్రియ కారణంగా రాష్ట్రంలోని పాఠశాలలు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు.

Read Also: IND vs SA: తొలి టెస్టు .. ఆధిపత్యం ప్రదర్శించిన భారత్

రికార్డు స్థాయిలో పోలింగ్

ఫలితాలు మరికొద్ది గంటల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు సూచించాయి. 1951 తర్వాత బీహార్‌లో అత్యధికంగా పోలింగ్ నమోదవడం విశేషం. ఈసారి 67.13 శాతం ఓటింగ్ నమోదు కావడంతో బీహార్ ఓటర్లు రికార్డ్ సృష్టించారు. అభివృద్ధి మరియు ఉపాధి అంశాలపై ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహించాయి. ఎన్డీయే అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకురాగా, మహాగఠ్‌బంధన్ ఉద్యోగాలు, పెన్షన్లు, మరియు అవినీతి వ్యతిరేక నినాదాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే వైపు స్పష్టంగా మొగ్గు చూపాయి.

రెండు విడతలలో ఎన్నికలు

Bihar Results: బీహార్‌లో మొత్తం 243 స్థానాల్లో 2 ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. మెజారిటీ కోసం 122 స్థానాలు అవసరం. రాష్ట్రంలో 7.45 కోట్ల ఓటర్లలో పురుషులు 3.92 కోట్లుగా, మహిళలు 3.50 కోట్లుగా ఉన్నారు.

  1. మొదటి విడత: నవంబర్ 6న 121 సీట్లకు పోలింగ్ జరిగింది. 3.75 కోట్ల మంది ఓటర్లు, 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 65% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది.
  2. రెండో విడత: నవంబర్ 11న 112 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 3.70 కోట్ల మంది ఓటర్లు, 1302 మంది అభ్యర్థులు పోటీచేశారు. 69% పైగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం.

కూటములు మరియు ప్రధాన పోటీదారులు

ఎన్డీయే కూటమి:

  1. జేడీయూ – 101
  2. బీజేపీ – 101
  3. లోక్ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్) – 28
  4. హిందుస్థానీ అవామ్ మోర్చా – 06
  5. రాష్ట్రీయ లోక్ మోర్చా – 06

మఢౌరాలో లాజేపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ తర్వాత, ఎన్డీయే స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్‌కు మద్దతు తెలిపింది.

మహాగఠ్‌బంధన్ కూటమి:

  1. ఆర్జేడీ – 143
  2. కాంగ్రెస్ – 61
  3. సీపీఐ(ఎంఎల్) – 20
  4. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ – 12
  5. సీపీఐ – 09
  6. సీపీఎం – 04
  7. ఇతరులు, స్వతంత్రులు – 06

ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ (రాఘోపూర్), సామ్రాట్ చౌదరి (తారాపుర్), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్), మైథిలీ ఠాకూర్ (అలీనగర్), ప్రేమ్ కుమార్ (గయా టౌన్) వంటి ప్రముఖ నాయకులు ప్రధాన పోటీదారులుగా నిలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar assembly elections Bihar Election Results 2025 Bihar Political News Bihar Polling 2025 NDA Bihar Victory Tejashwi Yadav

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.