📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Telugu News: Bihar Results: ఆ ఒక్క పథకమే బీహార్ లో నితీష్ కుమార్ కు పట్టం కట్టారా?

Author Icon By Sushmitha
Updated: November 14, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ ఎన్నికలు (Bihar Results) చాలా ఆసక్తిగా జరిగాయి. చివరి వరకూ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు బీహార్ లోఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీహార్ మహిళలు ఫలితాలను డిసైడ్ చేశారు. మహిళలు ఎన్డీయే వెనుక నిలబడటానికి ఒక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

Read Also: Bihar Risult: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ పార్టీ

Bihar Results

ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన్ బీహార్ లో ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలన్నింటిలో 2025 ఎన్నికలు చాలా ప్రత్యేకం. ఈసారి అత్యంత భారీ సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. బీహార్ లో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 67.13శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేశారు.

ఏకంగా 71.78శాతం మంది మహిళలు ఈ ఎన్నికల్లో(election) ఓటేశారు. మహిళల్ని అమితంగా ఆకట్టుకున్న పథకం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ అనే చెప్పాలి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఏటా రూ.10 వేలు అందుతాయి. సుమారు 1.3కోట్ల మంది మహిళలు ఉన్న ఆ రాష్ట్రంలో ఈ పథకం బాగా ఆకట్టుకుంది. ఇది ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడానికి తోడ్పడింది.

ఒకేసారి పదివేల ఆదాయంతో ఫిదా

ఎన్డీయే కూటమి అమలు చేసిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ స్కీమ్ ద్వారా ఆ రాష్ట్రంలోని మహిళలకు బలమైన ఆర్థిక సాయం అందినట్లయింది. 2022 సర్వే ప్రకారం బీహార్ లోని 34 శాతం కంటే ఎక్కువ కుటుంబాలు నెలకు రూ.6,000 లేదా అంతకంటే తక్కువఆదాయంతో జీవిస్తున్నారని తేలింది. 

ఇలాంటి కుటుంబాలకు ఒకేసారి రూ.10వేలు అందడం అనేది చాలా పెద్దవిషయం. దాంతో పథకం ఆగి పోతుందేమో అన్న భయంతో మరొకసారి బీహార్ ప్రజలు నితీష్ కుమారికి(Nitish Kumar) ఓటేసి గెలిపించారని నిపుణులు అభిప్రాయం. అంతేకాక 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం, వృద్ధాప్య పెన్షన్ రూ.1100 పెంచే హామీ వంటి ఆకట్టుకునే పథకాలు కూడా ఎన్డీయే గెలుపుకు కారణం అయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.