📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: Bihar: సలహాల ద్వారానే రూ. 241 కోట్లు సంపాదించిన ప్రశాంత్ కిశోర్

Author Icon By Rajitha
Updated: October 6, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ Prashant Kishor తన ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల్లో వ్యక్తులు, రాజకీయ పార్టీలు మరియు కంపెనీలకు సలహాలు ఇవ్వడం ద్వారా రూ. 241 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. ఆ మొత్తంలో రూ. 31 కోట్లు జీఎస్టీగా, రూ. 20 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించినట్లు ఆయన వివరించారు. జీఎస్టీ GST తన ఆదాయంలో సుమారు 18 శాతమని తెలిపారు. అలాగే, జన్ సురాజ్ పార్టీకి రూ. 98.95 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు కూడా ప్రకటించారు.

Fire Accident: బతుకుదామని వస్తే.. ప్రాణాలే పోయాయి..

Bihar

తాను ఎలాంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించలేదని, తన సంపాదన పూర్తి పారదర్శకంగా ఉందని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. “నా దగ్గరికి డబ్బు ఎలా వచ్చిందో, దానిని ఎక్కడ ఖర్చు చేశానో నేను బహిరంగంగా చెప్పగలను. గతంలో సలహాదారుడిగా పని చేసినప్పుడు ఎలాంటి ఫీజులు తీసుకోలేదు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నందున ఆదాయం వస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఇక బీహార్ రాజకీయాల్లో విపక్షాలు ఆయనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్ పలు మార్లు ప్రశాంత్ కిశోర్ ఆదాయ వనరులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రశాంత్ కిశోర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ తన ఆదాయం గురించి ఏమన్నారు?
గత మూడు సంవత్సరాల్లో రాజకీయ పార్టీలు, కంపెనీలు, వ్యక్తులకు సలహాలు ఇచ్చి రూ. 241 కోట్లు సంపాదించినట్లు తెలిపారు.

ఆయన ఎన్ని పన్నులు చెల్లించారు?
రూ. 31 కోట్లు జీఎస్టీ, రూ. 20 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించానని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

epaper: https://epaper.vaartha.com/

Read Also:

Bihar Jan Suraaj Party latest news political strategy Prashant Kishor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.