జేడీయూ అధినేత నితీష్ కుమార్ (Nitish Kumar) మళ్లీ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నితీష్ కొత్త మంత్రివర్గంలోకి ఇరవై ఆరు మంది మంత్రులు చేరారు.సామ్రాట్ చౌదరి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారం తర్వాత, సామ్రాట్ చౌదరి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Delhi Blsat: ఢిల్లీ పేలుళ్లపై అసెంబ్లీలో నిజం ఒప్పుకున్న పాక్ మంత్రి
విజయ్ సిన్హా తరువాత సామ్రాట్, విజయ్ ఇద్దరూ వరుసగా రెండవసారి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు, అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేదికపై ఉన్నారు.బీహార్ (Bihar) ముఖ్యమంత్రిగా ఇది ఆయన 10వ సారి. ఆయనతో పాటు, మరో 26 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కొత్త ప్రభుత్వంలో కుదిరిన మంత్రివర్గ ఒప్పందం ప్రకారం, స్పీకర్తో పాటు 17 మంత్రి పదవులను బీజేపీ దక్కించుకుంది. జెడియు కోటా నుండి పదిహేను మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) కు ఇద్దరు మంత్రులు,
మంత్రుల పూర్తి జాబితా ఇదే
జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం), ఉపేంద్ర కుష్వాహా పార్టీ (ఆర్ఎల్ఎం) కు ఒక్కొక్కరు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. నితీష్ తో పాటు, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా బిజెపి కోటా నుండి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సామ్రాట్ చౌదరి,విజయ్ కుమార్ సిన్హా,విజయ్ కుమార్ చౌదరి,బిజేంద్ర ప్రసాద్ యాదవ్,శ్రావణ్ కుమార్,మంగళ్ పాండే,డాక్టర్ దిలీప్ జైస్వాల్,అశోక్ చౌదరి,లేసి సింగ్,మదన్ సాహ్ని,నితిన్ నవీన్,రామ్కృపాల్ యాదవ్,సంతోష్ కుమార్ సుమన్,సునీల్ కుమార్,ఎండీ జామా ఖాన్,సంజయ్ సింగ్ టైగర్,అరుణ్ శంకర్ ప్రసాద్,సురేంద్ర మెహతా,నారాయణ్ ప్రసాద్,రామ నిషాద్,లఖేంద్ర కుమార్ రోషన్,శ్రేయసి సింగ్,డాక్టర్ ప్రమోద్ కుమార్,సంజయ్ కుమార్,సంజయ్ కుమార్ సింగ్,దీపక్ ప్రకాష్,
ఎన్డీఏ కూటమి అఖండ విజయం
కాగా,ఇటీవల జరిగిన (Bihar) ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89.. జేడీయూ 85 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 28 సీట్లను గెలుచుకున్నాయి.
ఈ క్రమంలోనే బుధవారం (నవంబర్ 19) జరిగిన బిహార్ NDA ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీష్కుమార్ను ఎన్నుకున్నారు. ఇక, బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి, బీజేఎల్పీ ఉపనేతగా విజయ్కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్కుమార్కు అవకాశం దక్కనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: