हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Telugu News: Bihar: మన సంస్కృతి, విశ్వాసాన్ని పై మహాకూటమికి విశ్వాసం లేదు మోదీ

Sushmitha
Telugu News: Bihar: మన సంస్కృతి, విశ్వాసాన్ని పై మహాకూటమికి విశ్వాసం లేదు మోదీ

అరారియా (బీహార్): బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరారియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి దేశ భద్రత గురించి మాత్రమే కాకుండా, దేశ సంస్కృతి మరియు విశ్వాసం గురించి కూడా ఎటువంటి ఆందోళన లేదని ఆయన అన్నారు. మన సంస్కృతిని, విశ్వాసాన్ని అగౌరవపరుస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Arundhati Reddy: మా అమ్మకు మీరే హీరో మోది జీ సార్

 Bihar
Bihar

ఛఠీ మైయా, రామాలయంపై కాంగ్రెస్ విమర్శలు

రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, కాంగ్రెస్ నాయకులు బీహార్‌కు వచ్చి ఛఠీ మైయా పూజను డ్రామా అని పిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. “ఇది ఛఠీ మైయాను అవమానించడం కాదా? ఇది మన విశ్వాసాన్ని అవమానించడమే. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు, ఆర్జేడీ ఎందుకు మౌనంగా ఉంటుంది?” అని ఆయన ప్రశ్నించారు. కుంభమేళా సమయంలో స్నానం చేయడాన్ని కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు ఎగతాళి చేసేవారని ప్రధాని మోదీ అన్నారు. వారికి రామాలయ నిర్మాణాన్ని, రాముడిపై నమ్మకాన్ని లేదని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు రాముడిని ద్వేషిస్తారని ఆయన విమర్శించారు.

“రాముడి ఆలయం ఎక్కడ నిర్మించామో, అక్కడ నిషాద్ రాజ్ కు, వాల్మీకికి, మాతా శబరికి కూడా ఆలయం ఉంది. రాముడిపై కోపం ఉంటే, వారి వద్దకు వెళ్లకండి, కానీ కనీసం ఇతర ప్రదేశాలకు అయినా వెళ్లండి” అని ప్రధాని మోదీ హితబోధ చేశారు.

జంగిల్ రాజ్, కూటమిలోని కలహాలు

1990 నుండి 2005 వరకు 15 సంవత్సరాలు బీహార్‌ను పాలించిన “జంగిల్ రాజ్”(Jungle Raj) రాష్ట్రాన్ని నాశనం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ 15 ఏళ్లలో బీహార్‌లో ఒక్క ఎక్స్‌ప్రెస్‌వే కూడా నిర్మించలేదని ఆయన అన్నారు. “కొన్ని రోజుల క్రితం, కాంగ్రెస్ – ఆర్జేడీ వైరాన్ని బయటపెట్టాను. కాంగ్రెస్ తన ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆర్జేడీకి వ్యతిరేకంగా నిలబెట్టింది. ఈ జంగిల్ రాజ్ కింద దళితులు, మహాదళితులు, చాలా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా నష్టపోయాయని వారే చెబుతున్నారు” అని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి, వారు ఒకరినొకరు గొడవలతో విడిపోతారని మోదీ జోస్యం చెప్పారు.

తొలి దశ పోలింగ్‌పై మోదీ స్పందిస్తూ, “బీహార్ అంతటా సోషల్ మీడియాలో అద్భుతమైన చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు వేయని వారు వీలైనంత త్వరగా ఓటు వేయాలని వినయంగా అభ్యర్థిస్తున్నాను. బీహార్ అంతటా ఒకే గొంతు ప్రతిధ్వనిస్తుంది.. అదే ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి” అని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870