📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Bihar: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తున్న లాలూ కుటుంబం

Author Icon By Pooja
Updated: December 26, 2025 • 3:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లాలూప్రసాద్ యాదవ్ కు పరిచయవాక్యాలు అవసరం లేదు. ఒకప్పుడు బీహార్(Bihar) రాజకీయాల్లోనే కాక జాతీయ రాజకీయాల్లో కూడా ఓ వెలుగువెలిగిన ఆయన ఎండుగడ్డి కుంభకోణంలో ఇరుక్కుని, జైలుపాలై, అనారోగ్యంతో బెయిల్ పై జీవిస్తున్నారు. కేంద్ర రైల్వేమంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూప్రసాద్ అప్పట్లో నిత్యం వార్తల్లో నిలిచేవారు. అవినీతి కేసులో జైలుపాలైనా, పార్టీ బాధ్యతలు భార్య రబ్రీదేవిపై పెట్టారు. ఆమెను ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి లాలూప్రసాద్ కు చెందిన ఆర్జేడీ పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.

Read Also: Delhi: ప్రారంభమైన CS ల 5వ జాతీయ సదస్సు

Bihar

దీంతో ఎంతోకాలంగా ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్ లోని బంగ్లాలో 19 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరపరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసేందుకు నిరాకరించింది. ముఖ్యమంత్రులుగా పని చేసిన తమకు బంగ్లాను కేటాయించరా? అని ఆర్జేడీ నిలదీసింది. పైగా లాలూ ప్రసాద్ కు అనారోగ్యం కారణంగా ఇదే బంగ్లా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం నిరాకరించింది. మొత్తానికి గురువారం సాయంత్రం నుంచి బంగ్లాను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. వస్తువులను తరలిస్తున్న వాహనాలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హర్డింగ్ రోడ్లో కొత్తగా బంగ్లా కేటాయింపు ప్రస్తుతం రబ్రీదేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 39 హోర్డింగ్ రోడ్ లో కొత్తగా బంగ్లాను కేటాయించారు. అయితే ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జనవరి 14నే పూర్తిగా బంగ్లాను ఖాళీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి(Bihar) అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే బంగ్లాను ఖాళీ చేయాలని లాలూప్రసాద్ కుటుంబానికి నోటీసు జారీ చేసింది. దీనిపై విమర్శల్ని గుప్పించిన ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా అధికారులు కనికరించలేదు. దీంతో బంగ్లాను ఖాళీ చేయకతప్పలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.