📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Bihar Elections: నవంబర్ 22లోపు బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ జ్ఞానేష్ కుమార్

Author Icon By Aanusha
Updated: October 5, 2025 • 10:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌ రాజకీయ రంగం మళ్లీ వేడెక్కబోతోంది. “గెట్‌.. సెట్‌… గో!” అంటూ ఎన్నికల బెల్‌ మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం (ECI). నవంబర్‌ 22లోపు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రకటించింది.ఈసారి బీహార్‌ ఎన్నికల్లో పలు కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా దేశంలోనే తొలిసారిగా అభ్యర్థుల కలర్‌ ఫోటోలు బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించబోతున్నారు.

Jyotiraditya Scindia: త్వరలోనే  BSNL 5G సేవలు: మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం బీహార్‌లో పర్యటించింది.ఒకట్రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని పొలిటికల్‌ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించాలని జేడీయూ (JDU) కోరింది. ఐతే ఎన్ని దశల్లో పోలీంగ్‌ నిర్వహించాలనే అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌.

బీహార్‌ ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. అనర్హులను ఓటర్లపై జాబితా నుంచి తొలగించామన్నారు సీఈసీ . బీహార్‌ ఓటర్లు ఆ జాబితాను స్వాగతించారన్నారు.తుదిజాబితాపై రాజకీయాల పార్టీలకు ఏవైనా అభ్యంతరాలుంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.

పౌరసత్వం, డేటా ఆఫ్‌ బర్త్‌కు ఆధార్‌ సాక్ష్యం కాదని

12 వందల మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయింమన్నారు ఈసీ . తొలిసారి ఈవీఎం బ్యాలెట్‌ షీట్‌పై అభ్యర్థుల ఫోటోలు, ఎన్నికల గుర్తును కలర్‌ ఫోటోలతో పాటు, అభ్యర్థుల సీరియల్‌ నెంబర్లను పెద్దగా ముద్రిస్తామన్నారు. పౌరసత్వం, డేటా ఆఫ్‌ బర్త్‌కు ఆధార్‌ సాక్ష్యం కాదని సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.బీహార్‌ (Bihar) లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు 17 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం ప్రకటించారు.

Bihar Elections

ఈ చర్యలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నమూనాలుగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. “బీహార్‌లో 17 కొత్త కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయబడ్డాయి.. కొన్ని ఎన్నికల నిర్వహణలో.. మరికొన్ని కౌంటింగ్‌లో అమలు చేయబడతాయి” అని CEC (Gyanesh Kumar) జ్ఞానేష్ కుమార్ అన్నారు.కాగా.. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

పరిశీలకులుగా 470 మంది అబ్జర్వర్లను నియమించింది

2025 నవంబర్‌ 22తో ముగుస్తుంది .అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఈసీ. గతంలో బీహార్‌లో మూడు, ఐదు విడతల్లో పోలీంగ్‌ (Polling) నిర్వహించిన సందర్భాలున్నాయి. ఒకే విడత పోలింగ్‌ జరపాలని జేడీయూ కోరగా.. రెండు, మూడు దశల్లో నిర్వహించాలని మిగతా పార్టీలు కోరాయి.

ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది ఈసీ. బీహార్‌ ఎన్నికల పరిశీలకులుగా 470 మంది అబ్జర్వర్లను నియమించింది.అక్టోబర్‌ 28న ఛత్‌ పండగ ఉండటంతో.. అక్టోబర్‌ 31 తర్వాత తొలి దశ నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Ballot paper photo Bihar assembly polls Bihar Elections Breaking News cec gyanesh kumar Election Commission of India Indian Politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.