📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Bihar Elections: బీహార్ లో ఎవరి బలాలేంత?

Author Icon By Rajitha
Updated: October 8, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ Bihar రాజకీయాలు మళ్లీ ఉత్కంఠభరితంగా మారాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 121 స్థానాలకు నవంబర్ 6న, మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉండగా, ప్రతిపక్ష ఇండి కూటమి ఈసారి అధికారం కోసం బలంగా పోటీ చేయనుంది. ముఖ్యంగా చిరాగ్ పాశ్వాన్ Chirag Paswan నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) తిరిగి ఎన్డీఏలో చేరడం, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ సురాజ్ పార్టీ రంగప్రవేశం చేయడం, అలాగే అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని AIMIM ప్రభావం ఈ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

BC Caste: ప్రత్యేక కమిషన్ తో బిసిల కులగణన నిర్వహించాలి: కె.రామకృష్ణ

Bihar Elections

ఎన్డీఏలో

ఎన్డీఏలో జేడీయూ, బీజేపీ సగం సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మిత్రపక్షాలకు సుమారు 38 సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ మాత్రం 40 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇదే విషయంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇంకా, ఇండి కూటమిలో ఆర్జేడీ 150 సీట్లు కోరుతుండగా, కాంగ్రెస్‌కు 55 సీట్లు ఇవ్వాలని ఆఫర్‌ చేసింది. ఇతర మిత్రపక్షాలకు మిగిలిన సీట్లు కేటాయించే అవకాశం ఉంది.

ప్రశాంత్ కిషోర్ నూతనంగా ఏర్పాటు చేసిన జాన్ సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనుంది. అక్టోబర్ 9న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. NDA, INDIA కూటములకు విరుద్ధంగా ఓటు వేయని ప్రజల మద్దతు తమ పార్టీకి వస్తుందనే విశ్వాసాన్ని కిషోర్ వ్యక్తం చేశారు. ఇక AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సీమాంచల్ ప్రాంతంలో ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కులగణన, నిరుద్యోగం, వలసలు వంటి సమస్యలే ప్రధాన చర్చాంశాలు. బీహార్‌ రాజకీయ దిశను నిర్ణయించే ఈ ఎన్నికలపై దేశం అంతా దృష్టి సారించింది.

బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ జరుగుతోంది?
ఎన్డీఏ కూటమి (బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ) మరియు ఇండి కూటమి (ఆర్జేడీ, కాంగ్రెస్ తదితరులు) మధ్య ప్రధాన పోటీ ఉంది.

ఈ ఎన్నికల్లో కొత్త పార్టీగా ఎవరున్నారు?
ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జాన్ సురాజ్ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

Bihar Elections Bihar Politics latest news NDA vs INDIA political alliances Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.