📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News:Bihar Elections:తేజస్వీ యాదవ్ ధీమా – బీహార్‌లో ఆర్జేడీ విజయం ఖాయం

Author Icon By Pooja
Updated: November 3, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Elections) విజయం తమదేనని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) ధీమాగా ప్రకటించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడుతాయని, 18న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మహాఘఠ్ బంధన్ కూటమి ప్రభుత్వం బీహార్‌లో ఏర్పడడం ఖాయమని తేజస్వీ చెప్పారు.

Read Also: Chevella Accident: బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా..మోదీ దిగ్బ్రాంతి

Bihar Elections

నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హామీ
తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నేరాల నిర్మూలనపై దృష్టి పెడతామని తేజస్వీ వెల్లడించారు. కుల, మత భేదాలు లేకుండా నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డిసెంబర్ 26 నుంచి జనవరి 26 లోపు రాష్ట్రంలోని అన్ని నేరస్తులు జైలులో ఉంటారని ప్రకటించారు. చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

మొకామా హత్య కేసు నేపథ్యంలో వ్యాఖ్యలు
జేడీయూ అభ్యర్థి, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త దులార్ చంద్ హత్య కేసుపై స్పందించిన తేజస్వీ, నేరస్తులకు ఎటువంటి సడలింపు ఇవ్వబోమని అన్నారు.

ప్రధాని మోదీపై విమర్శలు
బీహార్‌లో(Bihar Elections) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ప్రతి రోజు నేరాలు జరుగుతున్నాయని తేజస్వీ యాదవ్ విమర్శించారు. నేరాలపై స్పందించాల్సిన సమయం ఇదే అని ఆయన అన్నారు. ఆర్జేడీ నేత వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యంగ్యంగా స్పందించారు. ప్రజలు మళ్లీ సీఎం నితీశ్ కుమార్‌కే ఓటు వేస్తారని, ఈ విషయాన్ని తేజస్వీ కూడా బాగా తెలుసని అన్నారు. ఎన్నికల తర్వాత తేజస్వీ “విహార యాత్ర” పేరుతో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ భద్రతపై విజ్ఞప్తి
లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జేజేడీ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దులార్ చంద్ హత్య ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పారు. తన భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

BiharPolitics Latest News in Telugu TejashwiYadav Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.