📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest news: Bihar elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 5:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar elections) తొలి విడత పోలింగ్ లో జేడీయూ అధినేత, సీఎం నీతీశ్ కుమార్,(CM Nitish Kumar) విపక్ష సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ సహా పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఓట్లు వేశారు. తన సొంత జిల్లా బఖియార్ పుర్ లోని మంజు సిన్హా ప్రాజెక్ట్ గర్ల్స్ హైస్కూల్ లో ఉదయం ముఖ్యమంత్రి నీతీశ్ ఓటు వేశారు. అనంతరం తన పూర్వీకుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ నుంచి పాట్నాకు తిరిగి వెళ్లారు. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి బాధ్యత అని నీతీశ్ కుమార్ ట్వీట్ చేశారు.

Read also: ప్రమాదమంటూ రూ.35.23 లక్షలు దోచిన సైబర్‌ నేరగాళ్లు

మా ప్రభుత్వమే వస్తుంది.. తేజస్వీ

పాట్న వెటర్నరీ కళాశాలలోని పోలింగ్(Bihar elections) బూత్ లో విపక్ష సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆర్ జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, లాలూ సతీమణి రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ సతీమణి రాజశ్రీ, ఇతర కుటుంబ సభ్యులు ఓట్లు వేశారు. ఓటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడకుండా లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్లిపోయారు. కాగా తన ఇద్దరు కుమారులు (తేజస్వీ, తేజ్ ప్రతాప్)లకు నా ఆశీర్వాదాలు ఉంటాయని లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి మీడియాతో అన్నారు. కాగా తేజస్వీ మాత్రం తమ ప్రభుత్వమే వస్తుందని, 14వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

assembly-elections bihar-elections bihar-politics lalu-prasad-yadav Latest News in Telugu nitish-kumar rabri-devi tejashwi-yadav Telugu News voting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.