📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Bihar elections: నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ: ప్రియాంక

Author Icon By Saritha
Updated: November 1, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నికల్లో(Bihar elections) గెలిచేందుకు ఎన్డీయే సర్కారు విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆరోపించారు. నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకపోవడంతోనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని భాజాపాపై మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయ్ లో తన తొలి ప్రచార సభలో ఈ మేరకు ప్రసంగించారు.

Read also: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు

Bihar elections: నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ: ప్రియాంక

దేశాభివృద్ధికి తోర్పడిన బీహార్

దేశాభివృద్ధికి బిహార్(Bihar elections) ఎంతో దోహదపడింది. కానీ, రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. నెహ్రూ,ఇందిరా గాంధీలను భాజపా నేతలు విమర్శిస్తున్నారు. నిరుద్యోగం, వలసల వంటి అసలైన సమస్యలను పట్టించుకోవడం లేదు. విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీపై ప్రియాంక మండిపడ్డారు. బిహార్ ను ఢిల్లీ నుంచి నియంత్రిస్తారని, ఎన్డీయే పాలనలో ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని, బీజేపీ కోటి ఉద్యోగాల హామీపై స్పందిస్తూ ఇన్నేళ్ల పాలనలో ఏం చేసిందని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఈనెల 6,11 రెండు విడతలుగా బిహార్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయపార్టీలు తమ ప్రచారంలో మునిగిపోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Bihar Elections BJP Election campaign Fake Nationalism Indian Politics Latest News in Telugu Narendra Modi Priyanka Gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.