Latest news: Bihar elections: బీహార్ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ దూరం

Read Time:  1 min
Bhihar elections
Bhihar elections
FONT SIZE
GET APP

తేజస్విపై కసిగా పీకే లక్ష్యం – కానీ ఎన్నికల్లో బరిలోకి రారు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ (పీకే), రాజకీయ నాయకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, వచ్చే నవంబర్‌లో జరగనున్న బీహార్ (Bihar elections) అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. జన్ సురాజ్ పార్టీ తరఫున తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ, “నేను పోటీ చేయను. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నేను చేస్తున్న సంస్థాగత పనులపై దృష్టి సారిస్తాను” అని పీకే స్పష్టం చేశారు.

ఈ ప్రకటనతో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్‌కు పోటీగా పీకే నిలుస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అయితే రాజకీయ పోరులో తన ప్రధాన లక్ష్యం మాత్రం తేజస్వి యాదవ్‌ను ఓడించడమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అక్టోబర్ 11న రాఘోపూర్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించి, తన వ్యూహాలను ప్రారంభించారు.

Read also: భారత్ మద్దతిస్తుందని ఆశిస్తున్నాం: US సెక్రటరీ

Bihar elections

రాఘోపూర్‌లో పీకే శపథం – తేజస్విని అమేథీ తరహాలో ఓడిస్తాం

రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమేథీలో ఓడినట్లే, తేజస్వి యాదవ్‌ కూడా రాఘోపూర్‌లో ఓడతారని పీకే ధీమా వ్యక్తం చేశారు. రాఘోపూర్‌లో పర్యటించిన పీకేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల వెంట తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, రహదారులు, కనీస సౌకర్యాల లేమిపై పీకే ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ప్రజలకు మాట్లాడుతూ, “మీ ఎమ్మెల్యే రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా (Bihar elections) ఉన్నా, మీ సమస్యలు పరిష్కరించాలనే ప్రయత్నం చేశారా?” అని ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళలతో మాట్లాడుతూ, కేవలం కుల ఆధారంగా ఓటు వేయడమే గాక, ప్రజలు సమస్యలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతేకాక, తేజస్వి ఈసారి మరో స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలపై చర్చించగా, ఇది పీకే వ్యూహాల్లో భాగంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.