Bihar Elections: నితీష్-మోదీ జంట సక్సెస్… తేజస్వీ మరోసారి వెనుకబాటు

Read Time:  1 min
Bihar Elections
Bihar Elections
FONT SIZE
GET APP

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. తాజా పరిస్థితుల్లో ఎన్డీఏ ఘనంగా ముందంజలో ఉంది. మొత్తం 174 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 79 స్థానాల్లో, బీజేపీ 74 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల కలిసి చూపిస్తున్న బలమైన ప్రదర్శనతో మహాఘటబంధన్ వెనుకబడింది.

ఈసారి కూడా బీహార్(Bihar Elections) ప్రజలు “మోదీ–నితీష్” కాంబినేషన్‌పై నమ్మకం ఉంచి తమ ఓట్లను ఎన్డీఏకు అర్పించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు దశల్లో కూడా అధికంగా పోలింగ్ నమోదవడంతో, మొత్తం వాతావరణం ఎన్డీఏ పక్షానకి మారింది.

Read Also:  AmitShah : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ దూకుడు

Bihar Elections
Bihar Elections

బీహార్ ఎన్నికల ఫలితాల్లో 5 కీలక విశ్లేషణలు

1. నితీష్–మోదీ కాంబినేషన్‌పై ప్రజల నమ్మకం

ఫలితాల్లో కనిపిస్తున్న ట్రెండ్‌లు బీహార్ ఓటర్లు నితీష్ కుమార్(Nitish Kumar) మరియు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరోమారు అంగీకరించారని చెబుతున్నాయి. రెండు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న తరువాత కూడా, నితీష్ నేతృత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోలేదు. జేడీయూ మాత్రమే కాకుండా ఎన్డీఏలోని ఇతర పార్టీల అభ్యర్థులు కూడా మంచి ఆధిక్యాన్ని సాధించటం దీనికి నిదర్శనం.

2. తేజస్వీ యాదవ్‌ను సీఎంగా అంగీకరించని జనాలు

మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ముందుకు తీసుకువచ్చినప్పటికీ, బీహార్ ప్రజలు ఆయనను అంగీకరించలేదని ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రచారంలో తేజస్వీ చిత్రాలు, బ్యానర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఓటర్లు మాత్రం ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు.

3. “ఓటు దొంగతనం” ప్రచారం ఫలించలేదు

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చిన “ఓటు చోరీ” narrative బీహార్ ప్రజలను ప్రభావితం చేయలేదు. ఓటర్ల హక్కులపై అవగాహన కోసం ఆయన చేసిన యాత్రలు, మహాఘటబంధన్ నాయకుల కలిసికట్టుగా చేసిన ప్రచారం ఇప్పటికీ ఎన్డీఏ ఆధిక్యాన్ని తగ్గించలేకపోయాయి.

4. జన సూరజ్ పార్టీ ప్రభావం లేకుండా పోయింది

ప్రశాంత్ కిశోర్ ఆశలు పెట్టుకున్న జన సూరజ్‌ పార్టీని బీహార్ ఓటర్లు పూర్తిగా నిరాకరించినట్లు కనిపిస్తోంది. పార్టీ కేవలం ఒకే నియోజకవర్గంలో మాత్రమే పోటీగా నిలిచింది, అక్కడ కూడా విజయం సాధించగలదా అన్న సందేహం ఉంది. సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కూడా వాస్తవ ఓట్లలో ప్రతిఫలం ఇవ్వలేదు.

5. మహిళలు మరియు EBC ఓటర్లు ఎన్డీఏ వైపు

ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు మహిళా ఓటర్లు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారని సూచిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సాహ్ని పేరును ముందుకు తెచ్చినప్పటికీ, మహాఘటబంధన్‌కు EBC ఓటర్ల మద్దతు గణనీయంగా రాలేదు. ఈ అన్ని అంశాలు కలిపి చూసినప్పుడు, ఈసారి కూడా బీహార్ రాజకీయాల్లో ఎన్డీఏ స్పష్టమైన ఆధిపత్యాన్ని ఏర్పరుచుకున్నట్లు ఎన్నికల లెక్కింపు సూచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.