Telugu News: Bihar Elections: ముగిసిన బీహార్‌ అసెంబ్లీ పోలింగ్

Read Time:  1 min
Bihar Elections
Bihar Elections
FONT SIZE
GET APP

బీహార్‌లో(Bihar Elections) రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, అప్పటి వరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పిస్తున్నారు.

Read Also:  Tariffs: ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్.. భారత్ కు సుంకాలు తగ్గిస్తాం

Bihar Elections: మధ్యాహ్నం 3 గంటల సమయానికి నమోదైన పోలింగ్‌ శాతం 60.4గా ఉండగా, సాయంత్రానికి అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దశలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి.

మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, ఈ దశ కోసం 45 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.