📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Bihar Election Results: విజయం వైపు దూసుకెళ్తున్న అధికార కూటమి

Author Icon By Anusha
Updated: November 14, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Election Results) లెక్కింపు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే అధికార ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 122 పైగా స్థానాల్లో ముందంజలో ఉండటం ఎన్‌డీఏ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఈసారి కీలక అభ్యర్థుల వారీగా పోటీ మరింత హైలైట్ అవుతుండగా, ప్రతి నియోజకవర్గం నుండి వచ్చే సంఖ్యలు రాజకీయ సమీకరణాలకు కొత్త రంగులు అద్దుతున్నాయి.

Read Also: Bihar Results: బీహార్ ఫలితాలు..తేజస్వీకి మళ్లీ దక్కని CM కుర్చీ

ఆధిక్యంలో కొనసాగుతోంది. సాధారణ మెజారిటీ 122 కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్​డీఏ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో తారాపూర్ బీజేపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ ముందంజలో ఉన్నారు. అలీగఢ్​లో సింగర్ మైథిలి ఠాకూర్ మళ్లీ లీడ్​లోకి వచ్చారు. మిగిలిన బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో శ్రేయాసీ సింహ్ దూసుకెళుతుండగా, రామ్ కృపాల్ యాదవ్, విజయ్ కుమార్ వంటివారు వెనుకబడ్డారు.

ఆర్​జేడీ స్టార్ అభ్యర్థుల్లో ఒసామా షహాబ్, శతృగన్‌ యాదవ్​లు ఆధిక్యంలో ఉన్నారు. లాలూ కుమారుల్లో ఆర్​జేడీ నేత, మహాగఠ్​బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ రాఘోపూర్​లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా, జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం మహువాలో వెనుకబడ్డారు.

153 స్థానాల్లో ఆధిక్యం

ఇటీవల అరెస్టై జైలులో ఉన్న మొకామా నియోజక వర్గం జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. జన్ సురాజ్ అభ్యర్థి త్రిపురారీ కుమార్, సీపీఎం అభ్యర్థి దివ్యా గౌతమ్, ఆర్​జేడీ అభ్యర్థి వీణాదేవి వెనుకంజలో ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు నెమ్మదిగా నెట్టుకొస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఎన్​డీఏ ఏకంగా 153 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాగఠ్​బంధన్ 85 స్థానాల్లో ముందంజలో ఉంది. దీనిని బట్టి 243 స్థానాలు కలిగిన బిహార్​ అసెంబ్లీలో అధికార కూటమి స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది.

పార్టీల వారీగా చూస్తే, ఎన్​డీఏ కూటమిలోని జేడీయూ 72 స్థానాల్లో, బీజేపీ 67 స్థానాల్లో, ఎల్​జేపీ (రామ్ విలాస్​) 8 స్థానాల్లో, హెచ్​ఏఎం (ఎస్​) 5 స్థానా్లలో, ఆర్​ఎల్ఎం ఒక స్థానంలో అధిక్యంలో ఉన్నాయి.

మహాగఠ్​బంధన్​లో ఆర్​జేడీ 55 స్థానాల్లో, కాంగ్రెస్ 21 స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో, సీపీఐ(ఎం) రెండు స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) 5 స్థానాల్లో, ఐఐపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.

మరోవైపు ప్రశాంత్ కిశోర్​కు చెందిన జన్​ సురాజ్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ వెనుకబడ్డారు. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar Elections BJP candidates Breaking News latest news NDA Lead RJD performance Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.